Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through July 07, 2014 * Hyderabad Metro < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bewarsegadu
Kurra Bewarse
Username: Bewarsegadu

Post Number: 2197
Registered: 03-2013
Posted From: 68.229.205.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 10:19 pm:    Edit Post Delete Post Print Post

mostly finance matter anukuntunna

L&T and T Govts will bargaining on the costs escalated due to design change

L& T kaakaothe inkodu vasthaadu not a big deal for Tgana . so eventually L&T will compromise
Bewarsegadu Fan of Balayya and PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6985
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 9:04 pm:    Edit Post Delete Post Print Post


Andhramass:

okka community oppose cheysinanta matram naa city ki help ayye development ni stop cheyalem kadaa?




stop cheyyaru mama.... vallaki kavalsindi vallaki vacche varaku ibbandi pedatharu... anthe...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 54832
Registered: 07-2006
Posted From: 203.1.252.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 8:50 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

Appudu TRS vallu oppose chesaru mamaa...




but it still got approved kadaa.

okka community oppose cheysinanta matram naa city ki help ayye development ni stop cheyalem kadaa?

TRS ollu money collection kosam double game aduthunnatu undii chustha unthey
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6984
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 8:46 pm:    Edit Post Delete Post Print Post


Andhramass:




Appudu TRS vallu oppose chesaru mamaa...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 54831
Registered: 07-2006
Posted From: 203.1.252.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 8:42 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:




ninna eenadu lo central is looking to change current regulations/ policies regarding land collection for development purpose anni rasadduu

may be adi use chestharruu emmo or already approved ayyina plan kada edi

approval stage loo community consultation cheyssi untharruu kadaaa
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6983
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 8:39 pm:    Edit Post Delete Post Print Post


Andhramass:




Communal issues ante godavalu kaadu mama...What i meant was mazlis will oppose bcos the metro is passing so and so places ...plan change cheyyamantaru..ledante stop chestham antaaru... govt role em vundadu..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 54825
Registered: 07-2006
Posted From: 203.1.252.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 8:22 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

communal issues raise chestharu




cheyyakapovachu emmo mama

central Modi unnadu kada
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 49073
Registered: 05-2004
Posted From: 68.60.66.223

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 7:55 pm:    Edit Post Delete Post Print Post

KCR over action lo T-sentiment to cover cheyyochu anukuntunnadu, he will come to reality soon..
SOTW - Ramachakkani Seetaki
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6980
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 7:12 pm:    Edit Post Delete Post Print Post


Andhramass:




KCR ki emundi mama nastham... vundedi 5 years ye kada...Legala gaa kakpothe.. communal issues raise chestharu.. Inko self goal anukuntaa...


తెలంగాణ సర్కారుకు గుదిబండే
'ఆక్రమణ' ల వివాదంలో కొత్త కోణం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములుగా వేలం
వక్ఫ్ భూములు కాదని సుప్రీంలో అప్పటి సర్కారు పిటిషన్
వక్ఫ్ అని తేలితే భూమికి భూమి లేదా పరిహారమిస్తామని స్పష్టీకరణ
టీ సర్కారుకు ఇదే ఎదురు దెబ్బ
పిటిషన్ ఉపసంహరించుకుంటే వక్ఫ్ భూములని అంగీకరించినట్లే
భూమి లేదా పరిహారం ఇవ్వాల్సిందే
1654 ఎకరాలు లేదా 16 వేల కోట్లు చెల్లించక తప్పదు
ఆ భూముల్లోనే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తదితర సంస్థలు

'వక్ఫ్ భూముల' వ్యవహారంలో తెలంగాణ సర్కారు వైఖరి దానికే గుదిబండగా మారనుందా!? పరాధీనమైన ఆ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఖజానా పాలిట అలవిగాని ఖర్చుగా పరిణమించనుందా!? ఔననే అంటున్నాయి అధికార వర్గాలు! ఇందుకు కారణం.. 'అవి ప్రభుత్వ భూములు' అని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం నిర్ధారించడం! ఒకవేళ, అవి వక్ఫ్ భూములని తేలితే భూమికి భూమి లేదా పరిహారం ఇస్తామని కోర్టుకు హామీ ఇవ్వడం!

(హైదరాబాద్ -ఆంధ్రజ్యోతి) వక్ఫ్ భూముల వివాదానికి కేంద్ర స్థానం రంగారెడ్డి జిల్లాలోని మణికొండ గ్రామం. నిజాం హయాంలో ఇది జాగీర్ గ్రామం. పోలీసు యాక్షన్ జరగడం.. జాగీర్ వ్యవస్థ రద్దు కావడంతో 1949 అక్టోబర్ 3న ప్రత్యేక ఉత్తర్వు (జీవో 1) ద్వారా మణికొండ గ్రామం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. కాలక్రమేణా హైదరాబాద్ అభివృద్ధి చెందడం, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడంతో మణికొండ వంటి శివారు ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. ఇక్కడి భూములను రైతులతో పాటు సామాన్యులూ కొనుక్కున్నారు. హైటెక్ సిటీ ఏర్పాటు, ఇతర ఐటీ కంపెనీల రాకతో మణికొండ బంగారు భూమిగా మారింది. అదే సమయంలో, వైఎస్ ప్రభుత్వం జలయజ్ఞం తదితర ప్రాజెక్టులకు ఆదాయం కోసం అన్వేషించింది. తొండలు గుడ్లు పెట్టని భూములు కూడా ఎకరా కోటి నుంచి పది కోట్లకు అమ్ముడుపోవడం చూసి భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మణికొండలోని 1654 ఎకరాలను వేలం వేసింది. దీంతో, ల్యాంకో హిల్స్, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి సంస్థలతోపాటు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడి భూమిని బహిరంగ వేలంలో కొనుగోలు చేశాయి. ఈ వేలం ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్వహించింది. ఏపీఐఐసీ నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరానికి రూ.4.28 కోట్లు చొప్పున 108.05 ఎకరాలను ల్యాంకో హిల్స్ కొనుగోలు చేసింది. అక్కడే ఉన్న మరికొన్ని భూములను ఇన్ఫోసిస్, ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్, విప్రో, పోలారిస్ తదితర అంతర్జాతీయ సంస్థలకు కేటాయించింది! అలాగే, టీఎన్జీవోల హౌజింగ్ సొసైటీకి కూడా ఇక్కడ భూములు కేటాయించింది. అప్పట్లోనే ప్రభుత్వ చర్యను టీఆర్ఎస్ సహా తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. ఆ భూములు వక్ఫ్ భూములని ఆరోపించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, ఈ విషయం తొలుత హైకోర్టుకు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లింది. ల్యాంకో భూముల కొనుగోలును రద్దు చేయాలని దర్గా హజరత్ హుస్సేన్ షా వలీ తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు వచ్చినపుడు వైఎస్ ప్రభుత్వం... 'ల్యాంకోకు గానీ మిగిలిన సంస్థలకు గానీ కేటాయించింది ప్రభుత్వ భూములే.. వక్ఫ్ భూములు కాదు' అని అఫిడివిట్ దాఖలు చేసింది. 'అంతిమంగా అవి వక్ఫ్ భూములని తేలితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రతిగా నగదు లేదా ప్రత్యామ్నాయంగా భూమి అయినా ఇవ్వగలదు' అని హామీ ఇచ్చింది. ఇదే తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారనుంది.
పరిహారం రూ.16 వేల కోట్లకు పైమాటే!!
ల్యాంకో కొనుగోలు చేసినవి వక్ఫ్ భూములేనని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వక్ఫ్ భూములు కావంటూ సుప్రీంలో ఉన్న అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటామని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఇదే జరిగితే తెలంగాణ ప్రభుత్వం కోర్టులో గత సర్కారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి. అంటే వక్ఫ్ బోర్డుకు అంతే భూమి, లేదా భారీ పరిహారం చెల్లించేందుకు సిద్ధపడాలని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతిమంగా, తెలంగాణ ప్రభుత్వానికే భారంగా మారుతుందని పేర్కొంటున్నాయి. మణికొండలో ప్రభుత్వం వేలం వేసింది, కేటాయించింది మొత్తం 1654 ఎకరాలు. అవి వక్ఫ్ భూములేనని ప్రభుత్వం నిరూపిస్తే, ఆ మేరకు దర్గా హజరత్ హుస్సేనీ షా వలీకి మరోచోట ప్రభుత్వమే 1654 ఎకరాల భూమిని చూపించాల్సి ఉంటుంద. లేదా అంతమొత్తానికీ విలువకట్టి ఆ మేరకు దర్గాకు నగదు చెల్లించాలి. ఎకరా కనీసం 10 కోట్లు ఉందనుకున్నా, 16540 కోట్లు దర్గాకు టీ సర్కారు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ల్యాంకో వ్యవహారానికి వస్తే, ఆ సంస్థ ఆనాడు ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో, ఎక్కువ ధర పాడడం ద్వారా ఆ భూముల్ని కొనుగోలు చేసింది. వక్ఫ్ భూముల పేరిట ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోదలిస్తే, ల్యాంకో సంస్థకు నాటి మొత్తం దాదాపు 462 కోట్ల రూపాయలను వడ్డీతో సహా వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక, ల్యాంకో సంస్థ ఆ భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు కూడా విలువ కట్టి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా తడిసి మోపెడయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఒక వేళ అందుకు సిద్ధపడి ల్యాంకో నుంచి భూములు వెనక్కి తీసుకోవాలనుకున్నా... ప్రభుత్వమే కేటాయింపులు జరిపిన అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలను ఏం చేస్తారన్నది అసలు ప్రశ్న. ఇండియన్ బిజినెస్ స్కూల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పొలారిస్ వంటి కంపెనీలను ఆ భూముల నుంచి తరలించడం సాధ్యమా? హైదరాబాద్‌ను జాతీయ ఐటీ రాజధానిగా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు ఆ రంగంలోని అంతర్జాతీయ కంపెనీలకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటే ఎలాంటి సమస్యలొస్తాయి? హైదరాబాద్ ఇమేజ్ ఏమవుతుంది? కొత్తగా అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో కాలు మోపగలవా? మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పొలారిస్, ఐఎస్‌బీ లాంటి అంతర్జాతీయ సంస్థలకిచ్చిన భూములను వెనక్కు తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళతాయి? అని రెవెన్యూ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వాటిని పక్కనపెట్టి.. కేవలం ల్యాంకో భూములనే వెనక్కు తీసుకోవడం ఆచరణ సాధ్యమైన పని కాదని కూడా పేర్కొంటున్నాయి. ఒకవేళ కంపెనీలకు పరిహారం చెల్లించాల్సి వస్తే భూమితోపాటు, నిర్మాణాలకు కూడా విలువ చెల్లించాల్సి ఉంటుందని, అప్పుడు పరిహారం విలువ 25 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నివేదిక తారుమారు
ల్యాంకోకు కేటాయించినవి వక్ఫ్ భూములేనని వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు వక్ఫ్ బోర్డు సర్వే కమిషనరేట్ సర్వే నివేదికను అందజేసింది. అదే నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఆ నివేదికను పరిశీలిస్తే అనధికార మార్పులు, చేర్పులు చేసి టాంపరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సర్వే ప్రొఫార్మాలో కీలకమైన అంశాల్లో లోపాలున్నాయి. గ్రామం, వార్డు కింద మణికొండకు బదులు దర్గా హుస్సేనీ షా వలీ అని పేర్కొన్నారు. అలాగే, వక్ఫ్ ఆస్తుల వివరాలు అన్న కాలమ్‌లో తొలుత నిల్ ( ఏమీ లేవు) అని రాశారు. ఆ తర్వాత దానిని మరొకరు కొట్టి వేసి, మణికొండ జాగీర్‌లో వివిధ సర్వే నెంబర్ల కింద ఇనామ్ భూములు ఉన్నట్లు రాశారు. అంతేనా.. ప్రొఫార్మాలోని అన్ని అంశాలను ఒక వ్యక్తి రాస్తే.. కేవలం వక్ఫ్ ఆస్తుల వివరాలను మరొక వ్యక్తి రాశారు. అలాగే, ఈ భూములన్నీ రాజేంద్రనగర్ తహసిల్ పరిధిలోకి వస్తాయని, కానీ.. నివేదికలో శేరిలింగంపల్లి తహసిల్దార్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. సంతకాల ఫోర్జరీపై నాటి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సూర్యారావు ఫిర్యాదు మేరకు మాజీ వక్ఫ్ సర్వే కమిషనర్ మునవర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ టీవీవీ ప్రసాద్‌లపై 2007 సెప్టెంబర్ 20న కేసు నమోదైంది. 2011, జూలై 7న ఛార్జిషీట్ దాఖలైంది.
వైఎస్ సర్కారు వాదన ఏమిటి?
మణికొండలో వేలం వేసినవి, సంస్థలకు కేటాయించినవి పోరంబోకు భూములని గత 50 ఏళ్ల రెవెన్యూ, సర్వే రికార్డులు స్పష్టం చేస్తున్నట్టు వైఎస్ ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన వివరణలో పేర్కొంది. 1322 ఫస్లీ (ఆదేశం)లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని తెలిపింది. హైదరాబాద్ రెగ్యులేషన్ (జాగీర్ రద్దు చట్టం)ను ప్రభుత్వం 1949లో తీసుకొచ్చిందని, అప్పుడే మణికొండ జాగీర్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చిందని, అదే సమయంలో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది మాత్రం 1954లో అని వివరిస్తోంది. వక్ఫ్ చట్టం అమల్లోకి రాకముందే మణికొండ జాగీర్ రద్దు కావడమే కాకుండా దాని భూములు ప్రభుత్వ పరిధిలోతెలంగాణ సర్కారుకు గుదిబండే
'ఆక్రమణ' ల వివాదంలో కొత్త కోణం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములుగా వేలం
వక్ఫ్ భూములు కాదని సుప్రీంలో అప్పటి సర్కారు పిటిషన్
వక్ఫ్ అని తేలితే భూమికి భూమి లేదా పరిహారమిస్తామని స్పష్టీకరణ
టీ సర్కారుకు ఇదే ఎదురు దెబ్బ
పిటిషన్ ఉపసంహరించుకుంటే వక్ఫ్ భూములని అంగీకరించినట్లే
భూమి లేదా పరిహారం ఇవ్వాల్సిందే
1654 ఎకరాలు లేదా 16 వేల కోట్లు చెల్లించక తప్పదు
ఆ భూముల్లోనే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తదితర సంస్థలు

'వక్ఫ్ భూముల' వ్యవహారంలో తెలంగాణ సర్కారు వైఖరి దానికే గుదిబండగా మారనుందా!? పరాధీనమైన ఆ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఖజానా పాలిట అలవిగాని ఖర్చుగా పరిణమించనుందా!? ఔననే అంటున్నాయి అధికార వర్గాలు! ఇందుకు కారణం.. 'అవి ప్రభుత్వ భూములు' అని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం నిర్ధారించడం! ఒకవేళ, అవి వక్ఫ్ భూములని తేలితే భూమికి భూమి లేదా పరిహారం ఇస్తామని కోర్టుకు హామీ ఇవ్వడం!

(హైదరాబాద్ -ఆంధ్రజ్యోతి) వక్ఫ్ భూముల వివాదానికి కేంద్ర స్థానం రంగారెడ్డి జిల్లాలోని మణికొండ గ్రామం. నిజాం హయాంలో ఇది జాగీర్ గ్రామం. పోలీసు యాక్షన్ జరగడం.. జాగీర్ వ్యవస్థ రద్దు కావడంతో 1949 అక్టోబర్ 3న ప్రత్యేక ఉత్తర్వు (జీవో 1) ద్వారా మణికొండ గ్రామం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. కాలక్రమేణా హైదరాబాద్ అభివృద్ధి చెందడం, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడంతో మణికొండ వంటి శివారు ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. ఇక్కడి భూములను రైతులతో పాటు సామాన్యులూ కొనుక్కున్నారు. హైటెక్ సిటీ ఏర్పాటు, ఇతర ఐటీ కంపెనీల రాకతో మణికొండ బంగారు భూమిగా మారింది. అదే సమయంలో, వైఎస్ ప్రభుత్వం జలయజ్ఞం తదితర ప్రాజెక్టులకు ఆదాయం కోసం అన్వేషించింది. తొండలు గుడ్లు పెట్టని భూములు కూడా ఎకరా కోటి నుంచి పది కోట్లకు అమ్ముడుపోవడం చూసి భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మణికొండలోని 1654 ఎకరాలను వేలం వేసింది. దీంతో, ల్యాంకో హిల్స్, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి సంస్థలతోపాటు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడి భూమిని బహిరంగ వేలంలో కొనుగోలు చేశాయి. ఈ వేలం ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్వహించింది. ఏపీఐఐసీ నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరానికి రూ.4.28 కోట్లు చొప్పున 108.05 ఎకరాలను ల్యాంకో హిల్స్ కొనుగోలు చేసింది. అక్కడే ఉన్న మరికొన్ని భూములను ఇన్ఫోసిస్, ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్, విప్రో, పోలారిస్ తదితర అంతర్జాతీయ సంస్థలకు కేటాయించింది! అలాగే, టీఎన్జీవోల హౌజింగ్ సొసైటీకి కూడా ఇక్కడ భూములు కేటాయించింది. అప్పట్లోనే ప్రభుత్వ చర్యను టీఆర్ఎస్ సహా తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. ఆ భూములు వక్ఫ్ భూములని ఆరోపించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, ఈ విషయం తొలుత హైకోర్టుకు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లింది. ల్యాంకో భూముల కొనుగోలును రద్దు చేయాలని దర్గా హజరత్ హుస్సేన్ షా వలీ తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు వచ్చినపుడు వైఎస్ ప్రభుత్వం... 'ల్యాంకోకు గానీ మిగిలిన సంస్థలకు గానీ కేటాయించింది ప్రభుత్వ భూములే.. వక్ఫ్ భూములు కాదు' అని అఫిడివిట్ దాఖలు చేసింది. 'అంతిమంగా అవి వక్ఫ్ భూములని తేలితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రతిగా నగదు లేదా ప్రత్యామ్నాయంగా భూమి అయినా ఇవ్వగలదు' అని హామీ ఇచ్చింది. ఇదే తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారనుంది.
పరిహారం రూ.16 వేల కోట్లకు పైమాటే!!
ల్యాంకో కొనుగోలు చేసినవి వక్ఫ్ భూములేనని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వక్ఫ్ భూములు కావంటూ సుప్రీంలో ఉన్న అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటామని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఇదే జరిగితే తెలంగాణ ప్రభుత్వం కోర్టులో గత సర్కారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి. అంటే వక్ఫ్ బోర్డుకు అంతే భూమి, లేదా భారీ పరిహారం చెల్లించేందుకు సిద్ధపడాలని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతిమంగా, తెలంగాణ ప్రభుత్వానికే భారంగా మారుతుందని పేర్కొంటున్నాయి. మణికొండలో ప్రభుత్వం వేలం వేసింది, కేటాయించింది మొత్తం 1654 ఎకరాలు. అవి వక్ఫ్ భూములేనని ప్రభుత్వం నిరూపిస్తే, ఆ మేరకు దర్గా హజరత్ హుస్సేనీ షా వలీకి మరోచోట ప్రభుత్వమే 1654 ఎకరాల భూమిని చూపించాల్సి ఉంటుంద. లేదా అంతమొత్తానికీ విలువకట్టి ఆ మేరకు దర్గాకు నగదు చెల్లించాలి. ఎకరా కనీసం 10 కోట్లు ఉందనుకున్నా, 16540 కోట్లు దర్గాకు టీ సర్కారు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ల్యాంకో వ్యవహారానికి వస్తే, ఆ సంస్థ ఆనాడు ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో, ఎక్కువ ధర పాడడం ద్వారా ఆ భూముల్ని కొనుగోలు చేసింది. వక్ఫ్ భూముల పేరిట ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోదలిస్తే, ల్యాంకో సంస్థకు నాటి మొత్తం దాదాపు 462 కోట్ల రూపాయలను వడ్డీతో సహా వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక, ల్యాంకో సంస్థ ఆ భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు కూడా విలువ కట్టి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా తడిసి మోపెడయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఒక వేళ అందుకు సిద్ధపడి ల్యాంకో నుంచి భూములు వెనక్కి తీసుకోవాలనుకున్నా... ప్రభుత్వమే కేటాయింపులు జరిపిన అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలను ఏం చేస్తారన్నది అసలు ప్రశ్న. ఇండియన్ బిజినెస్ స్కూల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పొలారిస్ వంటి కంపెనీలను ఆ భూముల నుంచి తరలించడం సాధ్యమా? హైదరాబాద్‌ను జాతీయ ఐటీ రాజధానిగా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు ఆ రంగంలోని అంతర్జాతీయ కంపెనీలకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటే ఎలాంటి సమస్యలొస్తాయి? హైదరాబాద్ ఇమేజ్ ఏమవుతుంది? కొత్తగా అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో కాలు మోపగలవా? మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పొలారిస్, ఐఎస్‌బీ లాంటి అంతర్జాతీయ సంస్థలకిచ్చిన భూములను వెనక్కు తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళతాయి? అని రెవెన్యూ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వాటిని పక్కనపెట్టి.. కేవలం ల్యాంకో భూములనే వెనక్కు తీసుకోవడం ఆచరణ సాధ్యమైన పని కాదని కూడా పేర్కొంటున్నాయి. ఒకవేళ కంపెనీలకు పరిహారం చెల్లించాల్సి వస్తే భూమితోపాటు, నిర్మాణాలకు కూడా విలువ చెల్లించాల్సి ఉంటుందని, అప్పుడు పరిహారం విలువ 25 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నివేదిక తారుమారు
ల్యాంకోకు కేటాయించినవి వక్ఫ్ భూములేనని వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు వక్ఫ్ బోర్డు సర్వే కమిషనరేట్ సర్వే నివేదికను అందజేసింది. అదే నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఆ నివేదికను పరిశీలిస్తే అనధికార మార్పులు, చేర్పులు చేసి టాంపరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సర్వే ప్రొఫార్మాలో కీలకమైన అంశాల్లో లోపాలున్నాయి. గ్రామం, వార్డు కింద మణికొండకు బదులు దర్గా హుస్సేనీ షా వలీ అని పేర్కొన్నారు. అలాగే, వక్ఫ్ ఆస్తుల వివరాలు అన్న కాలమ్‌లో తొలుత నిల్ ( ఏమీ లేవు) అని రాశారు. ఆ తర్వాత దానిని మరొకరు కొట్టి వేసి, మణికొండ జాగీర్‌లో వివిధ సర్వే నెంబర్ల కింద ఇనామ్ భూములు ఉన్నట్లు రాశారు. అంతేనా.. ప్రొఫార్మాలోని అన్ని అంశాలను ఒక వ్యక్తి రాస్తే.. కేవలం వక్ఫ్ ఆస్తుల వివరాలను మరొక వ్యక్తి రాశారు. అలాగే, ఈ భూములన్నీ రాజేంద్రనగర్ తహసిల్ పరిధిలోకి వస్తాయని, కానీ.. నివేదికలో శేరిలింగంపల్లి తహసిల్దార్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. సంతకాల ఫోర్జరీపై నాటి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సూర్యారావు ఫిర్యాదు మేరకు మాజీ వక్ఫ్ సర్వే కమిషనర్ మునవర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ టీవీవీ ప్రసాద్‌లపై 2007 సెప్టెంబర్ 20న కేసు నమోదైంది. 2011, జూలై 7న ఛార్జిషీట్ దాఖలైంది.
వైఎస్ సర్కారు వాదన ఏమిటి?
మణికొండలో వేలం వేసినవి, సంస్థలకు కేటాయించినవి పోరంబోకు భూములని గత 50 ఏళ్ల రెవెన్యూ, సర్వే రికార్డులు స్పష్టం చేస్తున్నట్టు వైఎస్ ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన వివరణలో పేర్కొంది. 1322 ఫస్లీ (ఆదేశం)లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని తెలిపింది. హైదరాబాద్ రెగ్యులేషన్ (జాగీర్ రద్దు చట్టం)ను ప్రభుత్వం 1949లో తీసుకొచ్చిందని, అప్పుడే మణికొండ జాగీర్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చిందని, అదే సమయంలో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది మాత్రం 1954లో అని వివరిస్తోంది. వక్ఫ్ చట్టం అమల్లోకి రాకముందే మణికొండ జాగీర్ రద్దు కావడమే కాకుండా దాని భూములు ప్రభుత్వ పరిధిలో
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 54824
Registered: 07-2006
Posted From: 203.1.252.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 7:07 pm:    Edit Post Delete Post Print Post

ee vishayam lo KCR peekey di emmi ledhi

as it falls under leagl agreement.

even L&T project ni hold lo pettina T government has to pay for the delay.

the more the delay the more the cost of project will raise.
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6979
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 29, 2014 - 7:00 pm:    Edit Post Delete Post Print Post

2 weeks back baga telsina vallu chepparu... L&T ni 1000 crore demand chesaru anee... Now the project in doubt...

ఒప్పందాన్ని యథాతథంగా ఆమలు చేయాలి
డైలమాలో ఎల్ అండ్ టీ
సంకటంలో మెట్రో రైల్!
కొత్త మెలికలకు ఎంతమాత్రం అంగీకరించం
కాదూ కూడదంటే 1 నుంచి పనులు ఆపేస్తాం
టీ సర్కారుకు ఎల్ అండ్ టీ లేఖ?

(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి) రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు.. వివాదంలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మెట్రో రైలు పనులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పొసగని వాతావరణం.. ప్రాజెక్టును సంకటస్థితిలోకి నెడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైన లేఖ రాసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం (ఒరిజినల్ అగ్రిమెంట్)లోని బాధ్యతలను (కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్) యథాతథంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనీ, ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మంగళవారం (జూలై 1) నుంచి తాము పనులు ఆపేస్తామని ఆ లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టంచేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ మెట్రో (పిల్లర్ల ఆధారంగా ప్లై ఓవర్లపై వేసే రైలు మార్గం) నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు వేగంగా పనులను పూర్తి చేస్తోంది. ఇంతలోనే రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో.. మెట్రో రైలు మార్గం కోసం హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేయడాన్ని అంగీకరించబోమంటూ కొన్ని తెలంగాణ పార్టీలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఆందోళనలు కూడా నిర్వహించాయి.

అయితే అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఆ పార్టీ హయాంలోనే మెట్రో ఒప్పందం కుదరడంతో ఎల్ అండ్ టీ సంస్థ పనులను నిరాటంకంగా కొనసాగించగలిగింది. ఇబ్బందులేవైనా తలెత్తినా, అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సాయంతో ఉపాయంగా పరిష్కరించుకుంది. అయితే ఇంతలోనే విభజన ప్రక్రియ పూర్తి కావడం, ఎన్నికలు రావడం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయాయి. అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాల ముందు నుంచి ఎలివేటెడ్ మెట్రో రైలు మార్గాన్ని అనుమతించబోమని, అక్కడ సొరంగ పద్ధతిలో భూగర్భ రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సుల్తాన్ బజార్‌ను పరిరక్షించడం కోసం, జూబ్లీబస్ స్టేషన్ - ఫలక్‌నుమా కారిడార్‌ను దారి మళ్లించాలని ఆయన ఆదేశించారు. దీనిపై సమీక్ష జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా హెచ్ఎంఆర్ఎల్ అధికారులను ఆదేశించారు. కానీ.. "అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అదీగాక అక్కడ భూగర్భ మార్గం నిర్మించడం ఎంతమాత్రం సాధ్యం కాదని మా ఇంజినీర్లు తేల్చేశారు. మొత్తమ్మీద వ్యవహారాన్ని గమనిస్తే తెలంగాణ ప్రభుత్వం పాత విషయాలను తవ్వి తీసి, ప్రాజెక్టును మళ్లీ మొదటికి తెస్తున్నట్టు అనుమానంగా ఉంది'' అని ఎల్ అండ్ టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. నాగోల్-మెట్టుగూడ కారిడార్ దాదాపు పూర్తి కావచ్చింది. ఉప్పల్ డిపోలోనూ 95 శాతం పనులు పూర్తి అయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. నాగోల్-మెట్టుగూడ కారిడార్‌లో మెట్రో రైలు ప్రారంభానికి 2015 ఉగాదిని ముహూర్తంగా నిర్ణయించారు. కొరియా నుంచి నాలుగు మెట్రో రైళ్లను ఉప్పల్ డిపోకు రప్పించారు. జూన్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ స్వయంగా మీడియా ముందు ప్రకటించారు. ఈ తరుణంలో ప్రభుత్వం కొత్త మెలికలు పెట్టడంపై ఎల్ అండ్ టీ మెట్రో ఇంజినీర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.

ముభావంగా కేసీఆర్.. అప్పుడే అనుమానం!
నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండీ (ఎల్ అండ్ టీ) వీబీ గాడ్గిల్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు స్వయంగా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. అభినందనలు తెలియజేశారు. "అయితే ఆ సమయంలో కేసీఆర్ ముభావంగా కనిపించారు. ఆయన స్పందన ముక్తసరిగా, పొడిపొడిగా ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ వైఖరిపై మాకు అప్పుడే సందేహాలు కలిగాయి. తర్వాత పెడుతున్న మెలికలు మా అనుమానాలను ధ్రువీకరిస్తున్నాయి'' అని ఎల్ అండ్ టీ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడే ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండానే, ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో రైలు ప్రారంభ తేదీని ప్రకటించడంతో రెండు వర్గాల మధ్య అంతరం పెరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం లేదని ఎల్ అండ్ టీ సంస్థ ఉన్నతాధికార వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్టుకు అవసరమై భూసేకరణ... గడువు ముగిసినా ఇప్పటికీ పూర్తి కాలేదనీ, ఫలితంగా పనులు జాప్యమవుతాయని, ఇది మొత్తం ప్రాజెక్టుకు భారంగా మారడమే కాక, తమ ఇమేజ్ దెబ్బతింటుందని ఎల్ అండ్ టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో.. "ఇలాంటి ఇబ్బందికర స్థితి (సఫకేటింగ్ సిచ్యువేషన్)లో మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లగలమా? దీంట్లో కొనసాగడం మంచిదా? కొనసాగగలమా? లేక ప్రాజెక్టు నుంచి వైదొలగుదామా?'' అని ఎల్ అండ్ టీ డైలమాలో పడినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని, గతంలో కుదిరిన ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేయడానికి సానుకూలత వ్యక్తపరిస్తేనే మెట్రో రైలు ప్రాజెక్టులో కొనసాగాలని ఎల్ అండ్ టీ భావిస్తున్నట్టు సమాచారం. అలా కాకుండా కొత్త మెలికలు పెట్టి, వాటి అమలుకు ఒత్తిడి చేస్తే మాత్రం ప్రాజెక్టుకే గుడ్‌బై చెప్పాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తొలిదశగా ఈ లేఖ రాసినట్టు సంస్థ వర్గాలు వివరించాయి. మెట్రో రైలు ప్రాజెక్టు, టీ సర్కారుకు ఎల్ అండ్ టీ లేఖ వ్యవహారంపై ఆదివారం సాయంత్రమే 'ఏబీఎన్- ఆంధ్రజ్యోతి' కథనాన్ని ప్రసారం చేసింది. విషయం బయటపడగానే తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీశారు. అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు ఎల్ అండ్ టీ ఉన్నతస్థాయి అధికారులు ఎవరూ ఈ వార్తను ఖండించకపోవడం గమనార్హం. దీనిపై.. ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డిని 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధి సంప్రదించగా, ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration