కొత్త సినిమాలకి పచ్చజెండా వూపడంలో మహేష్ జోరు కొనసాగుతోంది. ఇక నుంచి మహేష్ నుంచి రాబోయే ప్రతి సినిమా ఓ కొత్త పంథాలో సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకదానికొకటి ఏమాత్రం పోలిక లేని కథల్ని ఎంపిక చేసుకొంటున్నారాయన. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ రాజకీయం నేపథ్యంలో సాగబోతోంది. అందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్పై ఉంది. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది. అది అమెరికా నేపథ్యంలో సాగే ఓ కొత్త రకమైన కథ. ఆ తర్వాత మహేష్తో సినిమా కోసం దర్శకుడు బోయపాటి శ్రీను కూడా పక్కా మాస్ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కలయికలో సినిమా కోసం మహేష్తో ఇదివరకు సినిమాలు చేసిన ఓ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సమయం కుదిరినప్పుడు రాజమౌళి దర్శకత్వంలోనూ సినిమా ఉంటుందని ఇదివరకే మహేష్ స్వయంగా ప్రకటించారు. మహేష్తో సినిమాలు చేయ బోతున్న దర్శకుల శైలిని గమనిస్తే, కొత్త రకమైన రుచులు కచ్చితం అనే అభిప్రాయం కలుగుతోందిJagath sathyam..Brahma Midhya.