Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27506 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 23, 2018 - 2:42 am: | |
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఏర్పాటైన మసూద్ కమిటీ నివేదిక పూర్తయింది. పోలవరం పనులు, పునరావాసంపై.. కేంద్ర జలవనరులశాఖ మసూద్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక నవయుగ కంపెనీ లక్ష్యాన్ని చేరుకుంటుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే పోలవరం ఆర్అండ్ఆర్పై మసూద్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. పైడిపాక గ్రామంలో లబ్ధిదారులతో మసూద్ కమిటీ సభ్యులు మాట్లాడారు. కాగా... పునరావాసంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని కమిటీ పేర్కొంది. space for lease
|