Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10602 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Thursday, February 22, 2018 - 9:45 am: | |
Kubang:
Mee vodini pattinchukoka povataniki reason idi anukunta..Canada is not taking any action agianst these groups.. కరుడుగట్టిన సిక్కు వేర్పాటువాది, ఖలీస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్కు భారత వీసా దక్కడంపై కేంద్ర విదేశాంగ శాఖ విస్మయం వ్యక్తం చేసింది. భారత్లో ప్రవేశించేందుకు అతడు వీసా ఎలా సంపాదించాడు, ముంబైలో కెనాడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్న ఓ కార్యక్రమానికి ఎలా వెళ్లాడు అన్న దానిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.... ‘‘ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు తేలాల్సి ఉంది. ఒకటి అతడు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, రెండు వీసా సంపాదించడం. అయితే తమ పర్యవేక్షణ లోపం వల్లే అలా జరిగిందనీ.. అతడి ఆహ్వానాన్ని రద్దు చేశామని కెనడా స్పష్టంగా చెప్పేసింది. ఇక వీసా విషయానికొస్తే.. అతడు ఎలా వీసా సంపాదించాడన్న దానిపై నేను ఇప్పటికిప్పుడే చెప్పలేను. మా దౌత్యకార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం సేకరించాం..’’ అని పేర్కొన్నారు. అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో సతీమణితో అత్వాల్ దిగిన ఫోటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిషేధిత ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్లో ఆయన క్రియాశీలకంగా ఉండడం, కెనడా ప్రధానితో సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు హల్చల్ చేస్తుండడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కు వేర్పాటు వాదానికి కెనడాలో కొందరి నుంచి ఇబ్బడిముబ్బడిగా నిధులు అందుతుండడంపై సమాధానం చెప్పలేక ఇప్పటికే ట్రూడో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాము ఎలాంటి వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వబోమని ట్రూడో ఇప్పటికే తేల్చిచెప్పారు. మరోవైపు ముంబైలోని కెనడా దౌత్య కార్యాలయంలో జరిగే విందు సమావేశానికి కూడా అత్వాల్కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో అతడి ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్టు కెనడా దౌత్యాధికారులు ప్రకటించారు. మరోవైపు అత్వాల్ కెనడా ప్రధాని అధికారిక బృందంతో ఎలాంటి సంబంధం లేదనీ.. ప్రధాని కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లేదని కెనడా ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. జస్పాల్ అత్వాల్ 1986లో పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్ధూపై జరిగిన హత్యాయత్నంలో దోషిగా తేలారు. 1986 కాల్పుల సమయంలో ఆయన సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్కు యూత్ ఫెడరేషన్లో క్రియాశీలకంగా ఉన్నారు. పంజాబ్ మంత్రిపై జరిగిన హత్యాయత్నంలో అత్వాల్తో పాటు మరో ఇద్దరు కూడా దోషులుగా తేలినట్టు 1987లో తీర్పు వెలువడింది. |