Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 773 Registered: 05-2017 Posted From: 68.118.179.187
Rating: N/A Votes: 0 | Posted on Thursday, December 21, 2017 - 11:28 am: | |
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాల్లో భాజపా విజయపరంపర కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్లలో విజయఢంకా మోగించడం ద్వారా భాజపా పాగా వేసిన రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో మరిన్ని రాష్ట్రాల్లోనూ కమలం పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సాధించిన ప్రభంజనాన్ని దక్షిణాది రాష్ట్రాల వరకు తీసుకెళ్లాలని గట్టి పట్టుదలతో ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ పార్టీని సంస్థాగతంగా పటిష్ఠ పరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్ఠానం బహుముఖ వ్యూహాలు అనుసరిస్తోంది. 2014లో అధికార పగ్గాలు చేపట్టిన భాజపా క్రమేపీ కాషాయ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కమల వికాసానికి పార్టీకోసం పూర్తి స్థాయిలో పనిచేసే వ్యవస్థను తీర్చిదిద్దుతోంది. వారికి అవసరమైన మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వినియోగించిన ద్విచక్రవాహనాలను విజయవాడకు తరలించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక్కో ద్విచక్రవాహనం సమకూర్చబోతోంది. వీటిని పార్టీ నియమించే విస్తారక్లకు ఇవ్వాలనేది భాజపా అధిష్ఠానం ఆదేశం. పూర్తిగా పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టే చురుకైన వ్యక్తులను విస్తారక్లుగా ఎంపిక చేస్తోంది. ముందుగా లోక్సభ నియోజకవర్గాలకు విస్తారక్ల నియామకాలు పూర్తి చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 175 వాహనాలను ఆంధ్రప్రదేశ్కు పంపాలన్నది పార్టీ నిర్ణయం. ఇప్పటికే 135 వాహనాలు విజయవాడ చేరుకున్నాయి. http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break141 I like it. BJP should go alone or with YCP in 2019. |