Capvenu
Kurra Bewarse Username: Capvenu
Post Number: 2300 Registered: 10-2007 Posted From: 192.195.66.3
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 02, 2017 - 11:28 am: | |
ఈసారీ మంచి ర్యాంకే సాధిస్తాం సులభతర వాణిజ్యంలో 15వ ర్యాంకు వచ్చిందన్న వార్త చూసి విస్మయం చెందా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఈనాడు అమరావతి: సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తుది ర్యాంకులకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ఇంకా ముగియక ముందే... రాష్ట్రానికి 15వ ర్యాంకు వచ్చినట్టుగా వచ్చిన వార్తను చూసి విస్మయం చెందానని ముఖ్యమంత్రి చంద్రబాబు వాఖ్యానించారు. ‘‘పత్రికలో వార్త చూసి నేను షాక్ తిన్నాను. ఎందుకు ఇలా వచ్చిందో ఒక్క నిమిషం నాకేమీ అర్ధం కాలేదు. వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. నా పరిస్థితే అలా ఉంటే.. సామాన్య ప్రజలు దాన్ని చదివి నిజమే అనుకుంటారు కదా..! మీడియా అత్యుత్సాహం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈసారి కూడా మన రాష్ట్రం మంచి ర్యాంకులో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తుది ర్యాంకులు రావడానికి డిసెంబరు నెలాఖరు వరకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు వివరించారు. తుది ర్యాంకులు ప్రకటించే వరకు... అప్పటికి అప్లోడ్ చేసిన వివరాల్ని బట్టి రాష్ట్రాల స్థానాలు మారుతూ ఉంటాయని, తుది ర్యాంకులనే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ..‘ఏదేమైనా ప్రతి రోజూ పోటీ ఉంటుంది. మనమే తెలివైన వాళ్లమనుకుంటే సరిపోదు. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉంటున్నాయి. పోటీ పడుతున్నాయి. ఎప్పటికప్పుడు మరింత తెలివిగా, సమర్థంగా వ్యవహరిస్తే తప్ప మనుగడ సాగించలేం’’ అని వ్యాఖ్యానించారు. Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
|