Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64694 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 31, 2017 - 12:12 pm: | |
Subbu Swamy rocks పలు సంక్షేమ పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భాజపా ఫైర్ బ్రాండ్, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం ట్విటర్ ద్వారా స్పందించారు. ‘ఆధార్ను తప్పనిసరి చేయడం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాను. దీనిపై సవివరంగా ప్రధాని నరేంద్రమోదీకి త్వరలోనే లేఖ రాస్తాను.’ అని స్వామి ట్విటర్లో పేర్కొన్నారు. ఆధార్ తప్పనిసరి అంశాన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించిన విషయం తెలిసిందే. ఆధార్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ దాఖలైన పటిషన్లపై వాదనలు ఆలకించడానికి విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నవంబరు నెలాఖరు నుంచి విచారణ ప్రారంభం కానుంది. #Spyder Audio Review
|