Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2789 Registered: 03-2004 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 31, 2017 - 11:44 am: | |
సింగపూర్ : ఏపీ రాజధాని నుంచి సింగపూర్ చేరుకున్న అమరావతి రైతులకు అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. సింగపూర్ తెదేపా ఫోరం ప్రతినిధులు జైరాం, చెన్నపాటి భానుచంద్ ఆధ్వర్యంలో సింగపూర్ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛాలు ఇచ్చి రైతులను ఆహ్వానించారు. సోమవారం 34 మంది రైతుల తొలిబృందం సీఆర్డీఏ అధికారులతో కలిసి సింగపూర్ వెళ్లింది. ఈ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో శుభాకాంక్షలు తెలిపి వీరి పర్యటనను లాంఛనంగా ప్రారంభించారు. నాలుగురోజులపాటు సింగపూర్లో వివిధ ప్రాంతాల్లో రైతులు పర్యటిస్తారు. 40 ఏళ్లలో సింగపూర్ అభివృద్ధి ఎలా సాధించిందనే అంశంపై అధ్యయనం చేసి అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించుకుంటారు. అభివృద్ధి దశలో అక్కడి ప్రజలకు ఎలాంటి అవకాశాలు వచ్చాయి? వాటిని ఎలా వినియోగించుకుని అభివృద్ధి చెందారనే అంశాలను ఈ పర్యటనలో రైతులు పరిశీలిస్తారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ చెన్నకేశవరావు తదితరులు రైతులతో ఉన్నారు. Jagath sathyam..Brahma Midhya.
|