Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2672 Registered: 03-2004 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 25, 2017 - 10:59 am: | |
చెన్నై: తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వరుస చిత్రాలు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయనున్నట్లు ప్రకటించగా, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మాతగా తేజ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుంది. ఇప్పుడు ఎన్టీఆర్పై మూడో బయోపిక్ కూడా సిద్ధమవుతోంది. సీనియర్ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ను తెరకెక్కించన్నుట్లు వెల్లడించారు. రామారావుపై ఉన్న ప్రేమ కారణంగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు జగదీశ్వర్రెడ్డి తెలిపారు. లక్ష్మీపార్వతి పాత్ర కోసం వాణి విశ్వనాథ్, రాయ్లక్ష్మీలను సంప్రదించినట్లు పేర్కొన్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, జనవరిలో సినిమాను విడుదల చేయన్నుట్లు చెప్పారు. పీసీరెడ్డి, విజయ నిర్మల, కృష్ణ, రాజశేఖర్, రాజేంద్రసింగ్, మోహన్గాంధీ, జి.రామ్మోహన్రావు తదితర దర్శకుల వద్ద జగదీశ్వర్రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్పై ఇటీవల రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితం ఓ మహాభారతం అని వ్యాఖ్యానించారు. అందులో విరాట్పర్వం, అరణ్యవాసం, పట్టాభిషేకం ఉంటాయని, తాను మాత్రం లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ తుది శ్వాస విడిచే వరకూ మాత్రమే తన చిత్రంలో చూపిస్తానని తెలిపారు. Jagath sathyam..Brahma Midhya.
|