Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10361 Registered: 03-2004 Posted From: 32.212.213.128
Rating: N/A Votes: 0 | Posted on Monday, October 23, 2017 - 6:31 am: | |
siggu seram lanti padaalu asslu vinaledhu anukunta Raghu veera... సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లొచ్చినా, చంద్రమండలానికి పోయొచ్చినా రాష్ర్టానికి ఒక్క పరిశ్రమ కాదు కదా... పైసా పెట్టుబడి కూడా రాదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖలో సదస్సులు నిర్వహించి రూ.11లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకున్నా... ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి తీసుకురాలేదన్నారు. సీఎం విదేశీ యాత్రల న్నీ ఆయన వినోద యాత్రలేనని విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురంలోని మడకశిర భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా మిగిలిన ఏడాదిన్నర కాలంలో విదేశాలకు వెళ్లకుండా మనవడితో ఆడుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలను ఎదుర్కోలేకనే ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు విదేశీ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలపై చంద్రబాబు స్పందించాలని, ఆ ఆరోపణలను ముఖ్యమంత్రి తన మీద వచ్చినట్లుగా భావించాలన్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్కు తాకట్టుపెట్టారని అనుకోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు కేసీఆర్తో జతకట్టారా, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అనేది కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎన్నికల్లో నామినేషన్ వేసినంత కాలం హస్తం గుర్తుపైనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. |