Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2493 Registered: 03-2004 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 11, 2017 - 9:04 am: | |
హోదాపై మోసం.. ప్రత్యేక ప్యాకేజీ అబద్ధం సాక్షి, అనంతపురం : పార్లమెంట్ సాక్షిగా హామీయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయేది. కానీ.. అధికారంలో ఉన్నవారు మోసం చేయడంతో ఆ పరిస్థితిని మనం చూడలేకపోతున్నాం. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును సాధించుకోవడానికి నిరంతరాయంగా, ఐక్యంగా పోరాడుదాం..’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. సోమవారం అనంతపురం పట్టణంలోని ఎంవైఆర్ గార్డెన్స్లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. ‘‘హోదాకానీ, ప్యాకేజీకానీ లేదన్నది నిజం : ప్రత్యేక హోదా రాష్ట్రాల్లోని 6.2 శాతం జనాభాకు 1.58 లక్షల కోట్లిచ్చారు, మరి 4కోట్ల ఆంధ్రులకు ఏమిచ్చారు? ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలందరికీ అర్థమైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అర్థం కావడంలేదు. కేవలం తన స్వార్థం కోసం ఆయన హోదాని పణంగా పెట్టారు. మాట్లాడితే, 14 ఆర్థిక సంఘం ఇవ్వడం లేదని, హోదాను మించిన ప్యాకేజీ తీసుకొచ్చానని బొంకుతున్నారు. ఈ రెండూ అబద్ధాలే. దేశంలో 11 రాష్ట్రాలకు హోదా ఉన్నమాట వాస్తం. మనకు మాత్రం హోదాగానీ, ప్యాకేజీకానీ లేదన్నదీ నిజం. రాష్ట్రాలకు వివిధ రూపాల్లో కేంద్రం ఎన్ని నిధులిచ్చాయనే దానిపై 2017, ఏప్రిల్ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల జనాభా 7.51 కోట్లు, అంటే దేశ జనాభాలో 6.2 శాతం. వీళ్లకు కేంద్రం 2016-17లో 1.58 లక్షల కోట్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం(9.7 లక్షల కోట్లులో) ప్రత్యేక హోదా రాష్ట్రాలకే 14.06 శాతం నిధులు వెళ్లాయి. మరి దేశజనాభాలో 4.08 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేవలం 44 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అదే హోదా ఉండి ఉంటే ఇంకా మెండుగా నిధులు వచ్చేవి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రాలకు నిధులిచ్చే విషయంలో తేడాలు ఎందుకు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఇటీవల జీఎస్టీని తెచ్చారు. అందులోనూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు భారీగా మినహాయింపులు ఇచ్చారు. ప్రధాని సౌభాగ్య యోజన(కరెంట్ లేని ఇళ్లకు కనెక్షన్) పథకంలోనూ హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా వాస్తవమైతే, చంద్రబాబు తన దగ్గరున్న మీడియాతో హోదా వల్ల ప్రయోజనం లేదంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది దారుణం కాదా? ఇది 10వ యువభేరి : ఇవాళ అనంతపురంలో జరుగుతున్నది 10వ యువభేరి. గుంటూరులో 9వ యువభేరి తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు, తర్వాతి విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జరిగింది. విరామం తర్వాత తిరిగి పోరాటాన్ని పునఃప్రారంభించాం. గత మూడున్నర సంవత్సరాలుగా అందరం కలిసికట్టుగా పోరాడం. వైఎస్సార్సీపీ పార్టీ పరంగానూ గడిచిన కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేశాం. రెండు నిరాహార దీక్షలు జరిగాయి. మంగళగిరిలో రెండు రోజులు, గుంటూరులో 7 రోజులు దీక్ష చేశాం. చంద్రబాబు పోలీసుల్ని పంపి గుంటూరు దీక్షను భగ్నం చేశారు. కనీసం ఆయనైనా మోదీగారిని ప్రత్యేక హోదా గురించి అడిగారా అంటే అదీ లేదు. ఇదే డిమాండ్ కోసం వైఎస్సార్సీపీ రెండు సార్లు రాష్ట్ర బంద్కు పిలుపిచ్చింది. ఆ బంద్లను విఫలం చేయడానికి చంద్రబాబు గారు బస్సులు తిప్పించారు. హోదా హామీ నెరవేర్చాలని ఢిల్లీ వెళ్లి ప్రధానిని మూడు,నాలుగు సార్లు కలిసి, వినతిపత్రాలిచ్చాం. చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీల్లోనూ ప్రత్యేక హోదా అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా పోరాటం చేశారు. ప్రతి బహిరంగ సభల్లో అంశాన్ని ప్రస్తావించాం. పార్టీ ప్లీనరీలో హోదాపై తీర్మానం చేయించాం. ఇవన్నీ చేసినా పాలకులు హోదా ఇచ్చారా?.. Jagath sathyam..Brahma Midhya.
|