Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2420
Registered: 03-2004
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0

Posted on Friday, October 06, 2017 - 6:21 am:   

తెలుగు రాష్ట్రాలు రెండింటినీ ప్రతి ఉదయమూ మరొక ‘ఉదయం’ కూడా పలకరించబోతోంది. సూర్యోదయం కాదిది. ఒకప్పట్లో దాసరి నారాయణరావు సారథ్యంలో సంచలన రాజకీయ వార్తలకు వేదికగా.. తెలుగు పాఠకులను అలరించిన ఉదయం దినపత్రిక వచ్చే ఏడాది తొలినెలల్లోనే మళ్లీ ప్రతి ఉదయం తెలుగు లోగిళ్ల తలుపు తట్టనుందని మీడియా వర్గాల్లో సమాచారం వ్యాపిస్తోంది. వచ్చే ఏడాది ఉగాది నాటికి ప్రారంభం కావచ్చునని కూడా అనుకుంటున్నారు.

ఎన్నికలు జరిగే సంవత్సరం దగ్గర పడుతూ ఉండడంతో.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా ‘మౌల్డ్’ చేసే ఉత్సాహం ఉన్న రాజకీయనాయకుల బినామీలు, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నవారు.. ఈ పత్రికను తీసుకువచ్చే పూచీ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొంత మంది జర్నలిస్టులను ఐడెంటిఫై చేయడం కూడా జరిగిందని వారి ద్వారా పత్రిక నిర్వహణకు సంబంధించిన మంతనాలు కూడా సాగుతున్నాయని వినికిడి.

దాసరి నారాయణరావు ప్రారంభించిన ఉదయం దినపత్రిక ఒకప్పట్లో తెలుగునాట సంచలనం. ప్రారంభం అయిన తొలిరోజే.. కాపీలు చాలక రీప్రింట్ కు వెళ్లిన పత్రిక అది. అలాంటి ఉదయం దినపత్రిక రాజకీయ సంచలన వార్తలకు అప్పట్లో వేదికగా ఉండేది. దాసరి నారాయణరావు యాజమాన్యం నుంచి పక్కకు మరలిన తర్వాత.. ఫక్తు రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు మాత్రమే చూసుకునే యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోయింది. పత్రిక నిర్వహణ కూడా గాడి తప్పిపోయింది. క్రమంగా మూతపడింది.

అయితే రాజకీయ పార్టీలకు మీడియా ఒక అత్యవసరమైన విభాగంగా అందరూ భావిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఎన్నికలింకా ఒకటిన్నర ఏడాది కంటె తక్కువ వ్యవధిలోనే వచ్చేస్తున్నందున ఇప్పటినుంచి మీడియా ఒకటి మన చేతుల్లో ఉంటే.. బాగుంటుందని భావించే పలువురు కలసి... ఉదయం పున:ప్రారంభానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

తెరవెనుక నుంచి పెట్టుబడుల రూపేణా ఎందరు సపోర్ట్ చేసినా.. తెరవెనుక ఎవ్వరు ఉన్నప్పటికీ.. తెరమీద మాత్రం మీడియాలో అనుభవం ఉన్న గ్రూపు ఆధ్వర్యంలోనే పత్రికను తేనున్నారని వినికిడి. తెలుగులో రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా సంస్థలు పనిచేయడం చాలా మామూలు సంగతి అయిపోయింది. అందుకే లాభనష్టాలతో నిమిత్తం లేకుండా పాతికకు పైగా న్యూస్ ఛానెళ్లు, పెద్దసంఖ్యలోనే దినపత్రికలు నడుస్తున్నాయి. ఈ కొత్త ‘ఉదయం’ వెనుక కూడా భాజపాకు చెందిన కొందరు పెద్దల ప్రమేయం కూడా ఉంటుందని సమాచారం.
Jagath sathyam..Brahma Midhya.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration