Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2216 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Sunday, September 24, 2017 - 1:12 pm: | |
రావణా బాక్సాఫీస్ సింహాసనా..! హైదరాబాద్: ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించడంపై ఇప్పటికే చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద విజయం అందించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ తారక్ ట్వీట్ చేశారు. కాగా గురువారం విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 75 కోట్లు రాబట్టిందని దర్శకుడు బాబీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్ ద్వారా చిత్రం కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ‘రావణా బాక్సాఫీసు సింహాసనా’ అని ట్వీట్ చేశారు. ఈ చిత్రం అమెరికాలో శుక్రవారానికి మిలియన్ డాలర్ల క్లబ్లో అడుగుపెట్టింది. బుధవారం ప్రదర్శించిన ప్రీమియర్తో మొత్తం రూ. 6.47 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. చిత్రం అద్భుతంగా వసూళ్లు రాబడుతోందని చెప్పారు. రాశీఖన్నా, నివేదా థామస్ ‘జై లవకుశ’లో కథానాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. పోసాని కృష్ణమురళీ, బ్రహ్మాజీ, సాయికుమార్, ప్రదీప్ రావత్ ప్రధాన పాత్రలు పోషించారు. చోటా కె. నాయుడు చిత్రానికి ఛాయాగ్రహణం అందించారు. |