Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 1817 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Friday, September 01, 2017 - 4:07 am: | |
Greate Telugu హోం రాజకీయాలు సినిమా సినిమారివ్యూ ఎమ్బీయస్ ఇంటర్వ్యూ ఈ-పేపర్ ట్రెండ్స్ వారఫలాలు పంచాంగం English Home > Politics - Gossip వైఎస్జగన్కు నంద్యాల రిజల్ట్ చేసే మేలేంటి? August 01 , 2017 | UPDATED 03:30 IST నిజమే... వైసీపీ అనూహ్యంగా నంద్యాలలో ఓడింది. హోరా హోరీ పోరులో చంద్రబాబు పక్కా వ్యూహంలో ఇరుక్కుని విలవిల్లాడింది. కురుక్షేత్ర సంగ్రామం అనీ, యుద్దమనీ, న్యాయమనీ, ధర్మమనీ ప్రతిపక్షనేత దాదాపు 2వారాల పాటు చెవినిల్లు కట్టుకుని ఎంతగా అరచి గీపెట్టినా నంద్యాల ఓటరు చెవికి తప్ప మనసుకు తాకకుండా చేయడంలో బాబు అండ్ కో అద్భుతమైన పనితనాన్ని చూపింది. ఏమైతేనేం... నంద్యాల పోరు ముగిసింది. దీంతో తెలుగు దేశం పార్టీ సహజంగానే సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ సహజంగానే కాస్త సైలెంట్ అయిపోయింది. అయితే అంతా అయిపోయినట్టేనా? నంద్యాల ఉప ఎన్నిక తో వైసీపీ సత్తా తేలిపోయినట్టేనా? ఈ ఓటమి జగన్కు ఎంత మాత్రం మేలు చేయడం లేదా? అని ప్రశ్నించుకుంటే కాదనేదే సమాధానం. నిజానికి ఇది వైఎస్ జగన్కు ఆయన పార్టీకి పూర్తిగా ఇబ్బంది కలిగించే ఫలితంగా పైకి కనిపిస్తున్నా... తరచి చూస్తే ఈ ఫలితం రానున్న రోజుల్లో ఆ పార్టీకి కీడు కన్నా మేలే ఎక్కువ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదెలా అంటే... - గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన పూర్తిస్థాయి ఎన్నిక ఇదే. ఈ మూడేళ్లలో చంద్రబాబు, జగన్లు ప్రత్యక్షంగా అదీ నేరుగా ఎటువంటి మద్ధతూ లేకుండా తలపడిన ఎన్నిక కూడా ఇదే. దాంతో వైసీపీకి రానున్న ఎన్నికలకు బలమైన రిహార్సల్ వేసినట్టయింది. తమ పార్టీ శక్తి యుక్తులు ఏమిటి? లోటు పాట్లు ఏమిటి? వగైరాలను గుర్తించే వీలు కలిగించింది. ఈ ఎన్నికే లేకపోతే... వచ్చే సాధారణ ఎన్నికల వరకూ మళ్లీ ఇలాంటి అవకాశం వైసీపీకి వచ్చి ఉండేది కాదు. -కేవలం ఐదారేళ్ల వయసున్న పార్టీ ఎకా ఎకిన రాష్ట్ర విభజన తదితర ప్రత్యేక పరిస్థితుల మధ్య తన ప్రధమ సమరాన్ని ఆరంభించిన పార్టీ వైసీపీ. ఆ పార్టీ ఇలాంటి ఎన్నికను ఎదుర్కునే అవకాశం రావడం మంచి అనుభవాన్ని అందిస్తుంది. -అసెంబ్లీలో అవతలి పక్షం ఎంత కవ్వించినా సబ్జెక్ట్పై తప్ప మరో అంశం జోలికి పోకుండా, రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న ప్రతి చిన్న సమస్య మీదా పోరాటాలు జరుపుతూ...విపక్షనేతగా అంచనాలను మించి రాణించిన జగన్... ప్రతిపక్షనేత హోదాలో ఎదుర్కున్న ఈ ఎన్నిక ఆయన శక్తి యుక్తులకు పూర్తి స్థాయి పరీక్ష పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీ తన సర్వశక్తులూ పణంగా పెడితే తప్ప గెలవలేని పరిస్థితిని కల్పించిన జగన్ తన సత్తాను నిరూపించుకుంటూనే సమరాంగణంలో తనే అంతా అవడం ద్వారా, తనలోని పోరాట పటిమను కార్యకర్తలకు, నేతలకు చూపించినట్టయింది. -ఈ ఎన్నికలో తెదేపా గెలవడం వల్ల ఆ పార్టీకి పెద్దగా వచ్చిన లాభం ఏమీ లేదు. ఫిరాయింపు ద్వారా ఇప్పటికే ఆ సీటును తన ఖాతాలో వేసుకున్న తేదేపా...అధికారంలో ఉండి కూడా ఈ ఎన్నికను గెలిచేందుకు నానా పాట్టు పడింది. అన్ని రకాలుగా చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసి గెలిచినా ఆ పార్టీ కోత్తగా దక్కించుకుంది ఏమీ లేదు. కేవలం ఏడాదిన్నర పాటు ఉండే ఎమ్మెల్యే పదవిలో ఏ మాత్రం అనుభవం లేని యువకుడిని కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో అతని భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చడం తప్ప. - ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే లాభం సంగతేమో కానీ... ఆ పార్టీలో అతి విశ్వాసం ఏర్పడే అవకాశం ఉండేది. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా గెలవడం అంటే మాటలు కాదు. అంత ఘన విజయం సాధించినందుకు ఆ పార్టీ తనను తాను మరచిపోయేది. తమ పార్టీ అధినేత ప్రచారం చేస్తే చాలు తాము గెలిచేస్తామనే భ్రమల్లో కూరుకుపోయే ప్రమాదం ఉండేది. అవన్నీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించేవి. -నంద్యాలలో దాదాపు 70వేల ఓట్లు సాధించిన వైసీపీ... అధికార తెలుగుదేశం పార్టీతో పోలిస్తే చాలా పిన్న వయసు పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే దిగ్గజ నేత కీర్తి ప్రతిష్టలపై మాత్రమే ఆధారపడి గత ఎన్నికల్లో పోరాడిన ఆ పార్టీ... తనదైన శైలి నాయకత్వ పటిమతో సాధించిన ఈ ఓట్ల (అది కూడా అంతటి హోరాహోరీ పోరులో ) సంఖ్య తీసి పారేసేదేం కాదు. వైసీపీ మరో 13.5వేల ఓట్లు గాని సాధిస్తే... ఇరు పార్టీలు సమ ఉజ్జీలు అయి ఉండేవన్నది కూడా ఇక్కడ మర్చిపోకూడని విషయం. -కేవలం వైఎస్సార్ ఇమేజ్తోనే ఈ పార్టీ గత ఎన్నికల్లో రాణించిందని, ఇక ఆ పరిస్థితి లేదు కాబట్టి వైసీపీ పని అయిపోయిందని వాదించేవారికి నంద్యాల ఎన్నికలో వైసీపీ సాధించిన ఓట్లే సమాధానం. -వైఎస్ జగన్కు ప్రజాభిమానం ఏ స్థాయిలో ఉందో ఆయన సభలకు వచ్చే జనసందోహం చూస్తే తెలుస్తుంది. అయితే అవన్నీ గ్యారంటీగా ఓటు గా మారిపోతాయనే భ్రమలేవైనా ఉంటే అవి పోవడానికి, ఆ ప్రజాభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవాలంటే చేయాల్సింది ఇంకా ఉందని తెలుసుకోవడానికి కూడా వైసీపీకి ఈ ఎన్నిక ఉపకరిస్తుంది. -ఈ ఎన్నిక ఫలితాన్ని పార్టీలు తీసుకున్నంత సీరియస్గా జనం తీసుకోరనేది నిర్వివాదం. తెలుగు దేశం ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ ఫలితం ప్రభావితం చేయదనేది కూడా నిస్సందేహం. -సాధారణ ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాదిన్నర కాలం పైనే సమయం ఉన్న నేపధ్యంలో పూర్తిస్థాయిలో తమను తాము సమీక్షించుకుని, లోపాలను దిద్దుకుని, ఎన్నికలకు సర్వసన్నధ్ధం అయేందుకు ఈ ఎన్నిక- దాని ఫలితాన్నే గాని వైసీపీ ఆధారం చేసుకుంటే... అనుకున్న విజయాన్ని దక్కించుకునేందుకు పుష్కలమైన అవకాశాలు ఆ పార్టీకి లభిస్తాయి. |