Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4577 Registered: 08-2014 Posted From: 183.82.98.78
Rating: N/A Votes: 0 | Posted on Monday, April 03, 2017 - 8:52 am: | |
మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారినందరినీ బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మంత్రులును, ఇతర సీనియర్లను పంపించి హామీలు ఇవ్వడమో... పరిస్థితులు వివరించడమో చేసి మెత్తబెడుతున్నారు. అయితే.. ఓ నేత విషయంలో మాత్రం చంద్రబాబు బుజ్జగింపులు కాకుండా బెదిరింపుల మార్గం ఎంచుకున్నారట. అది కూడా ఆయన్నే తన వద్దకు పిలిపించుకుని ఫుల్లుగా వార్నింగు ఇచ్చారట. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది.. జాగ్రత్త అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘కాపులకు అన్యాయం జరగడం మామూలయిపోయింది. నాకు పదవి రాకుండా ఓ ప్రముఖుడు అడ్డుపడ్డారు’’ అంటూ బొండా ఉమ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడం తెలిసిందే. కాపులకు అన్యాయం అంటూ బొండా ఉమయే గొంతెత్తడంతో చంద్రబాబుకు కోపం నషాళానికి అంటిందట. వెంటనే ఆయన్ను పిలవాలని ఎంపీ కేశినేని నానిని పంపించగా.. ఏదో హామీ ఇస్తారని భావించి వెంటనే ఆయన ఉమాను చంద్రబాబు వద్దకు తెచ్చారు. అయితే.. అక్కడ సీను తేడా కొట్టింది. ‘‘ఈ సమయంలో కాపులకు అన్యాయం జరిగిందని చెబుతావా? ఎమ్మెల్యే అయి మూడేళ్లయిన నీకే అలా ఉంటే సీనియర్ల మాటేమిటి? కులసమీకరణలు చూడాలి కదా? మొన్న కమిషనర్ వ్యవహారంలో నీమీద అసలు కేసు పెట్టాలి. నీ జాతకం అంతా నా దగ్గర ఉంది. తమాషాలు చేయొద్దు’’ అంటూ ఫైరయ్యారట. దీంతో బొండా ఉమ, కేశినేని నాని ఇద్దరూ బిక్క మొహం వేసినట్లు తెలుస్తోంది.
|