Ispate
Kurra Bewarse Username: Ispate
Post Number: 1096 Registered: 01-2012 Posted From: 108.192.149.49
Rating: N/A Votes: 0 | Posted on Saturday, February 25, 2017 - 10:59 pm: | |
ఇస్లామాబాద్: సాధారణంగా బస్సుల్లో, రైళ్లలో సీట్లు లేని సమయంలో మనం నిలబడి వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా విమానంలో నిలబడి ప్రయాణం చేశారని మీరు విన్నారా.. పాకిస్థాన్లో ఇటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పాకిస్థాన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం కరాచీ నుంచి మదీనాకి బయలుదేరింది. ఈ క్రమంలో 409తో ఉన్న ఆ విమానం అదనంగా మరో 7 మంది ప్రయాణికులను ఎక్కించుకొని బయలుదేరింది. ఈ విషయాన్ని పాకిస్థాన్లోని స్థానిక పత్రిక ప్రచురించటంతో వెలుగలోకి వచ్చింది. దీనిపై స్పందించి అధికార ప్రతినిధి డానియల్ గిలానీ విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. మొత్తం సీట్లన్నీ నిండిపోయిన తర్వాత కూడా విమానంలోకి ఏడుగురిని ఎక్కించి తీసుకెళ్లిన మాట వాస్తవమేనన్నారు. చేతితో రాసిన బోర్డింగ్ పాస్లు ఇచ్చి వాళ్లను విమానం ఎక్కించారని, ఇలా తీసుకెళ్తే చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదనంగా ప్రయాణికులు ఉన్న విషయాన్ని టేకాఫ్ అయిన తర్వాత గమనించానని, అప్పటి వరకు ఆ విషయం తన దృష్టికి రాలేదని పైలెట్ వివరించారు. టేకాఫ్ తర్వాత తెలియటంతో వెనక్కి మళ్లించలేక పోయాయని ఆయన చెప్పారు. వెనక్కి తీసుకొచ్చేందుకు ఇంధనం వృథా అవుతుందని, విమానయాన సంస్థ ప్రయోజనాలకు విరుద్దం కాబట్టి అలాగే ముందుకు వెళ్లినట్లు పైలెట్ చెప్పారని స్థానిక మీడియా పేర్కొంది. ఇలా చేయటం చాలా ప్రమాదకరమని, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆక్సిజన్ మాస్కులు వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. "manaki pissa lite annattu" REX thatha
|