Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9051 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Sunday, September 18, 2016 - 7:46 am: | |
intha sick person vi anukoledhu. neeku baga buddi chepparu T janalu... ఈలోపు సుష్మా వద్దకు వెళ్లిన ఎంపీలు పరిగెత్తుకుంటూ జైపాల్ వద్దకు వచ్చారు. ‘‘కాంగ్రెస్ కావాలనే డ్రామా ఆడుతోందని, ఇప్పుడు బిల్లు పాస్ అయితే పేరు కాంగ్రెస్కు, అవకపోతే చెడ్డపేరు బీజేపీకి వచ్చేలా వ్యూహ రచన చేశారని చెబుతున్నారు’ అని వాపోయారు. స్పీకర్ చాంబర్లో... స్పీకర్, కమల్నాథ్, సుష్మా, జైపాల్ తదితరుల మధ్య చర్చ జరిగింది. ‘బిల్లు పెడితే పాస్ చేయించే బాధ్యత మీదే అన్నారు కదా. మీరే పాస్ చేయించండి’ అని కమల్ అన్నారు. ‘మీ మంత్రులే వెల్లోకి గొడవ చేస్తుంటే మీకే బాధ్యత లేదా?’ అని సుష్మ ప్రశ్నించారు. (సభకు గైర్హాజరైన ఇరుపార్టీల సభ్యులపై చర్చ జరిగింది. ఓటింగ్ జరిగితే తలెత్తే ఇబ్బందులపైనే వాదోపవాదాలు జరిగాయి.) ఈ సమయంలో జైపాల్ జోక్యం చేసుకుని... ‘‘ఓటింగ్ జరిగితే బిల్లు పాస్ కాదు. ఇక్కడ మీరెవరూ ఆలోచించని కోణం ఒకటుంది. అసలు ఓటింగ్ ఎందుకు పెట్టాలి?’ అని ప్రశ్నించారు. ఓటింగ్ పెట్టాలని రాజ్యాంగం చెబుతోందని స్పీకర్, ఎంతమంది ఓటు వేశారో తెలియకుండా బిల్లు పాస్ అయినట్లు ఎలా ధ్రువీకరిస్తారని కమల్నాథ్ ప్రశ్నించారు. ‘వాయిస్ ఓటుతో బిల్లు పాస్ అయినప్పుడు ఓటింగ్ ఉండదు కదా’ అని జైపాల్ అన్నారు. ‘అదెలా సాధ్యం. మంత్రులే వెల్లో నినాదాలిస్తుంటే మూజువాణీ ఓటుతో బిల్లు ఆమోదించినట్లు ఎలా క్లోజ్ చేస్తారు? ఇదేమైనా సీక్రెట్ మీటింగా? ప్రపంచమంతా చూస్తుంటుంది’’ అని సుష్మా అన్నారు. జైపాల్ కల్పించుకుని... ‘‘ఓటింగ్ జరపకుండా బిల్లు ఆమోదించడానికి ఒక ప్రొవిజన్ ఉంది. అది... రూల్ 367(3). స్పీకర్ అవసరమనుకుంటే డివిజన్ను నిరాకరించవచ్చు. ఆ రూల్ చదవండి. బిల్లు పాసయ్యిందని ప్రకటించండి. దీనిపై ఎందుకింత చర్చ’’ అని జైపాల్ ప్రశ్నించారు. ఇదంత తేలిక కాదని, ఓటింగ్కు నిరాకరించినా ఎంత మంది అనుకూలమో, ఎందరు వ్యతిరేకమో లెక్కపెట్టి, సంఖ్య ప్రకటించి బిల్లు పాసయ్యిందని ప్రకటించాలని స్పీకర్ అన్నారు. ‘‘అధ్యక్ష స్థానంలో కూర్చుని ఏం చెప్పినా దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. అది రూల్. అన్ని సవరణలు అరగంటలో ఫినిష్! అధికార పక్షం మాట్లాడదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ఏమిటి అభ్యంతరం’’ అని జైపాల్ ప్రశ్నించారు. ‘‘మీరిలా మాట్లాడతారని నేను ఏనాడూ అనుకోలేదు. రూల్స్, రాజ్యాంగం ఏదీ లెక్కపెట్టనక్కర్లేదనే ఆలోచన మీరు చేయగలరని భావించలేదు’’ అని సుష్మా అన్నారు. ‘‘మీ తెలంగాణ విషయం వచ్చేటప్పటికి ఎంత మారిపోయారు. ఇంత దారుణం జరిగితే చూసి సహించలేని వ్యక్తి అనుకున్నాం గానీ, దారుణం ఎలా చేయాలో మీరే చెబుతారని ఏనాడూ ఊహించలేదు’’ అని కమల్నాథ్ ఆక్రోశించారు. దీనికి బదులుగా జైపాల్... ‘‘ఆత్మవంచనలో బతకొద్దు. వంచన చేసినా ఫర్వాలేదు. దాదాపు అంతా ఒప్పేసుకున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలా ఆగిపోయిందో... ఎవరూ ఒప్పుకోకున్నా విభజన బిల్లు ఆమోదం పొందాలి’’ అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ... ‘‘ఇది చిన్న విషయం కాదు. మీరన్నట్లు ఏవో కాకిలెక్కలు చెప్పేసి, సవరణలు కొట్టేసి, బిల్లు అయిపోయిందనిపించడానికి వీల్లేదు. మొత్తం ప్రక్రియ టీవీ ద్వారా ప్రపంచం చూస్తుంటుంది. సెక్రటేరియట్ స్టాఫ్, రిపోర్టర్లు జరిగింది జరిగినట్లు రికార్డు చేస్తారు’’ అన్నారు. అందుకు జైపాల్ చెప్పిన సమాధానం... ‘‘ఏం కంగారు పడకమ్మా! ఫిఫ్టీ ఇయర్స్ ఇక్కడ! ఆ అనుభవంతో చెబుతున్నా! నువ్వు అధ్యక్ష స్థానంలోకూర్చోగానే టీవీ ప్రసారాలు అకస్మాత్తుగా ఆగిపోతాయి. సంబంధిత టెక్నీషియన్లు రిపేరు చేసేలోగా బిల్లు పాసయిపోతుంది. అమ్మా... కట్టెకాడ్ అనే ప్రాంతంలో ఒక తెగ ఉంది. ఆడపిల్ల పుడితే... నోట్లో, ముక్కులో బియ్యపు గింజ వేసి చంపేస్తారు. ఇలా జరుగుతోందని ప్రభుత్వానికీ, ప్రపంచానికీ తెలుసు. కానీ, ఒక్క కేసూ నమోదు చేయించలేకపోయారు. తల్లిదండ్రులే పసిగుడ్డును చిదిమేస్తే ఎవరేం చేయగలరు. పార్లమెంటు కూడా కట్టెకాడ్ తెగలాంటిదే. తండ్రిలాంటి అధికారపక్షం, తల్లిలాంటి ప్రతిపక్షం కలిసి బిడ్డను చంపేయాలనుకున్నప్పుడు స్పీకర్ది మంత్రసాని పాత్రే’’ అని! |