Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8893
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Friday, July 08, 2016 - 10:44 am:   

maree inthe edavavi anukoledhu...

ఆంద్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ మంచి చొరవే తీసుకున్నారు. కాని ఆశించిన ఫలితం వచ్చినట్లు కనిపించడం లేదు. హైకోర్టు విభజన సమస్యపై వచ్చిన ఆందోళన నేపద్యంలో నరసింహన్ తన హోదా రీత్యా ఉన్న ప్రోటోకాల్ ను కూడా పక్కనబెట్టి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విజయవాడలో కలుసుకున్నారు. ఇది నిజంగానే అందరిని ఆకర్షించిన ఘట్టంగా మారింది.ఒక రకంగా చంద్రబాబు కు గర్వ కారణంగా మారిందంటే ఆశ్చర్యం కాదు. హైకోర్టు విభజనను తాను విజయవంతంగా అడ్డుకోగలుగుతున్నానన్న సందేశాన్ని ఆయన పంపగలిగారు. ఎలాగొలా చంద్రబాబు ను ఒప్పించి ఈ వివాదాన్ని పరిష్కారించానన్న క్రెడిట్ పొందుతామని అనుకున్న గవర్నర్ కు ఒకింత ఆశాభంగమే ఎదురైనట్లుగా కనిపిస్తుంది.ఆయన చంద్రబాబుతో చర్చలు ఫలవంతంగా జరిగాయని చెబుతున్నా,వాస్తవంలో అది సందేహంగానే ఉంది.ఎందుకంటే చంద్రబాబు తెలివిగా కొత్త ఫిటింగ్ పెట్టారట. అన్ని విభజన సమస్యలను ఒకేసారి పరిష్కరించుకుంటే తాను సిద్దమని, అలా కాకపోతే కుదరదని ఆయన అన్నారట. చంద్రబాబుకు తెలుసి అది అంత ఆచరణ సాద్యం కాని విషయమని.అందుకే ఈ లిటిగేషన్ పెట్టడంతో గవర్నర్ పట్టువిడుపులు ఉండాలని అబిప్రాయపడ్డారు. ఆయా అంశాలలో తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు వస్తే ఉమ్మడి హైకోర్టు కనుక అక్కడకు వెళ్లవచ్చని ,లేకుంటే ప్రతిదానికి సుప్రింకోర్టుకు వెళ్లవలసి ఉంటుందని చంద్రబాబు అన్నారని కదనాలు వచ్చాయి.ఇది నిజమా?కాదా అన్నది పక్కన బెడితే ,చంద్రబాబు వ్యూహాత్మక వాదనను తెరపైకి తెచ్చారని అనుకోవచ్చు.సచివాలయాన్ని హడావుడిగా తరలించ లేదా? ఉద్యోగులకు డెడ్ లైన్ పెట్ట లేదా అని కొందరు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. కాని వాటిని ఆయన వినదలచుకోలేదు. హైదరాబాద్ లో ఉమ్మడి సంస్థల ఆస్తుల సంగతితో సహా ఆయా అంశాలపై తేల్చండని చంద్రబాబు షరతు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని , కేంద్రాన్ని ఆయన ఇరుకున పెట్టగలిగారన్న అబిప్రాయం ఏర్పడుతుంది.అదే సమయంలో హైకోర్టు విభజనకు అడ్డుపడడంలో ఆయనకు ఉన్న రాజకీయ ప్రయోజనాలపై కూడా విస్తృత ప్రచారం జరుగుతోంది.అన్నిటిని మేనేజ్ చేయడంలో నిపుణుడుగా చంద్రబాబుకు పేరొందని, అందువల్లే హైకోర్టు విభజనకు ఆయన సిద్దపడడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. ఒక సారి హైకోర్టు విబజన జరిగితే పరిస్థితులు,పరిణామాలు మారిపోతాయని, అవి చంద్రబాబుకు అంతగా రుచించవన్నది వీరి వాదన.ఆ విషయాల సంగతి ఎలా ఉన్నా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని వీలైన్ని వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయడం అవసరం.ఆస్తుల పంపిణీ, నీటి వివాదాలు, ఇలాంటి ప్రదాన మైన వాటిలో స్పష్టత వస్తే చాలావరకు గొడవ తగ్గినట్లే అవుతుంది. కాని అది ఇప్పట్లో తీరుతుందా అన్నది సంశయమే.నిత్యం ఏదో ఒక అంశంలో రెండు రాష్ట్రాలు తగాదాలు పడుతున్నాయి. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ వెబ్ సైట్ లోని వివరాలను ఎపి ప్రభుత్వం కాపీ కొట్టిందంటూ తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు,కేంద్రానికి ఫిర్యాదు చేయడం కొత్త గొడవగా ఉంది. ఎపి ముఖ్యమంత్రి సలహాదారు పరకాల ప్రభాకర్ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు. ఇరువైపులా సవాళ్ల పర్వం సాగుతోంది. ఇదొక్కటే కాదు.అనేక అంశాలలో ఇలాగే జరుగుతోంది.ఇవి పరిష్కారం కావాలంటే మరో ఓటుకు నోటు కేసు,మరో టెలిపోన్ టాపింగ్ కేసు వంటివి బయటకు వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు చకచకా రాజీపడతారేమో! అంతవరకు ఇద్దరికి ప్రజలలో సెంటిమెంటు ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడానికి ఇలాంటి వివాదాలు అవసరంగానే కనిపిస్తాయి. అందువల్ల గవర్నర్ ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,కెసిఆర్ లను కమాండ్ అయినా చేసి వీటికి ఫరిష్కారం కనుగొనగలగాలి .మరి అది సాద్యమేనా!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration