Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27740 Registered: 08-2008 Posted From: 116.88.66.65
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, June 28, 2016 - 1:08 pm: | |
తెలుగువారిపై జయ కన్ను పడింది ! 28-06-2016 16:16:07 మొన్నటి వరకు తెలుగువారిని చిన్నచూపు చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు మనసు మార్చుకున్నారా? తెలుగువారికి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారా...? చెన్నై కార్పొరేషన్ ఎన్నికలతో తెలుగువారితో ఉన్న లింకేమిటి..? తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మకుటం లేని మహారాణి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అధికారంలోకి వచ్చారు సరే... తమిళనాడులో ఉన్న తెలుగువారి పరిస్థితి ఏమిటి..? జయ ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోంది... నిజానికి ఒకప్పుడు తెలుగువారిపట్ల జయలలిత కాసింత అభిమానం చూపేవారు. తెలుగు సాంస్కృతిక భవనాన్ని ఏర్పాటు చేస్తామని... పేదరికంలో మగ్గుతున్న తెలుగువారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని.. నిర్బంధ తమిళభాషను సడలిస్తామని..ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు జయలలిత. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. గత క్యాబినెట్లో కాంచీపురం ఎమ్మెల్యే చిన్నయ్య మంత్రిగా ఉన్నారు. ఆయనను సరైన కారణం లేకుండానే బర్తరఫ్ చేశారు. తిరువళ్లూరు నుంచి ఎన్నికయిన రమణను కూడా మంత్రిపదవి నుంచి తప్పించారు. ఇవి పెద్ద విషయాలు కావు కానీ... నిర్బంధ తమిళ భాషను అమలులోకి తేవడమే తెలుగువారిని అమితంగా బాధిస్తోంది. నిర్బంధ తమిళ విద్య కారణంగా దాదాపు 12 వేల మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీరియస్గా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమిళనాడు ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు కూడా ! మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తమిళనాడు మంత్రులతో చర్చలు కూడా జరిపారు. అయినా పెద్దగా ఫలితం లేదు. జాతీయ పార్టీగా మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముందుగా తమిళనాడుపైనే దృష్టి పెట్టింది.. టీ.నగర్లోని నగేశ్ థియేటర్లో సమావేశాన్ని నిర్వహించి.. ఆ రాష్ర్టంలో పార్టీ శాఖను ఏర్పాటు చేయాలనుకుంది. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని అడ్డుకోవడానికి జయ ప్రభుత్వం ఎన్ని చేయాలో అన్నీ చేసింది. సమావేశాన్ని రద్దు చేసుకోవలసిన పరిస్థితి తీసుకువచ్చింది. దాంతో అండమాన్ నికోబార్ దీవులపై దృష్టి పెట్టింది టీడీపీ.. అక్కడ సత్తా కూడా చాటుకుంది. వాస్తవానికి తమిళనాడులో తెలుగువారి సంఖ్య అధికమే! శతాబ్దాల కిందటే ఎంతోమంది తెలుగువారు అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. రాష్ర్ట జనాభాలో దాదాపు 40 శాతం మంది తెలుగువారే! మొన్నటి ఎన్నికల ముందు ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చిందట! అందుకే ఓటర్ల జాబితాలో తెలుగువారి పేర్లు మార్చేశారట! సేలం....తేని.. తూతికూడి... కడలూరు.. మధురై.. కోయంబత్తూరు.. రాజపాళెం.. తిరునల్వేలి వంటి ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారు.. అక్కడ సుబ్రహ్మణ్యం అన్న పేరు కాస్త సుబ్రహ్మణ్యన్గా మారిపోయిందట! సంఖ్యాపరంగా తెలుగువారి లెక్కలు కూడా తప్పుగా చెప్పారట! అందుకే మొన్నటి ఎన్నికల్లో తెలుగువారు జయలలితకు వ్యతిరేకంగా ఓటు వేశారన్న ప్రచారం జరుగుతోంది. జయలలిత పోటీ చేసిన ఆర్.కె.నగర్లో కూడా తెలుగువారి సంఖ్య ఎక్కువ. గతంలో ఆమెకు లక్షా 30 వేల ఓట్ల మెజారిటీ వస్తే మొన్నటి ఎన్నికల్లో మాత్రం మెజారిటీ గణనీయంగా తగ్గింది. తెలుగువారు అత్యధికంగా నివసించే చెన్నై నగరంలోని కొలత్తూర్... ట్రిపుల్ కేన్...హార్బర్... అన్నానగర్... తిరివిక్కానగర్ నియోజకవర్గాలు...కంచివరం జిల్లాలోని చెంగల్పట్టు.. అలందూర్... తాంబరం... మధురాంతకం... పల్లవరం...సొలంగనూర్ తదితర నియోజకవర్గాల్లో డీఎంకే విజయం సాధించింది. జయలలిత రాజకీయ వ్యూహాలు ఓ పట్టాన అర్థం కావు. ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గాల వారీగా పరిస్థితిని గమనించిన ఆమె.. ఇప్పుడిప్పుడు.. మళ్లీ తెలుగువారిపై వల్లమాలిన ప్రేమాభిమానాలు చూపుతున్నారట! ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ప్రకాశం జిల్లాకి చెందిన ఐఏఎస్ అధికారి రామ్మోనరావుని నియమించుకున్నారు. మరో అయిదారు నెలల్లో చెన్నై కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. చెన్నై సిటీలో తెలుగువారితో సఖ్యంగా ఉండటం బెటరనే నిర్ణయానికి ఆమె వచ్చారట! అందుకే... తెలుగువారైన రాజ, బాలకృష్ణారెడ్డిలకి క్యాబినెట్లో స్థానం కల్పించి మంత్రులను చేశారు. చూద్దాం....మారిన వ్యూహంతో చెన్నయ్ కార్పొరేషన్లో జయ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయో! जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|