Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8808 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Friday, June 17, 2016 - 10:54 am: | |
Lovebewarsetalk:
జీతభత్యాలు, సౌకర్యాల కల్పన విషయంలో తెలంగాణతో పోల్చుకుంటున్న ఉద్యోగుల్లో స్వరాష్ట్రం అన్న భావన మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వంతో చేయి కలిపి కష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్న పట్టుదల లేకుండాపోయింది. దాయం ఇబ్బడిముబ్బడిగా ఉన్నందున తెలంగాణలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వెలువడగానే సచివాలయంలో, జిల్లాల్లో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. నిజానికి ఉద్యోగ సంఘాల నాయకులు 33 శాతం ఫిట్మెంట్ ఇస్తే అదే పదివేలు అన్న భావనతో ఉన్నారు. అయినా 43 శాతం లభించింది. ఊహించని విధంగా ఫిట్మెంట్ లభించినా ఏపీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నదీ లేదు. ముఖ్యమంత్రిని అభినందించిందీ లేదు. పౌరాణిక పాత్రలకు ప్రాణంపోసిన ఎన్టీఆర్కు సమఉజ్జీగా నువ్వానేనా అన్నట్టుగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు ఎస్వీ రంగారావు. అంతటి గొప్ప నటుడికి బతికి ఉన్నప్పుడుగానీ, చనిపోయిన తర్వాతగానీ కనీసం పద్మశ్రీ వంటి బిరుదు కూడా దక్కలేదు. ఆయన కాపు వర్గానికి చెందినవాడు కావడమే ఇందుకు ప్రధాన కారణం.చిరంజీవి వంటివారు స్వశక్తితో చిత్ర పరిశ్రమలో రాణించినా ఎస్వీఆర్కు న్యాయం జరిపించడానికి ప్రయత్నించలేకపోయారు. ఎస్వీఆర్కు ఇంత అన్యాయం జరగడానికి ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడమే కారణం! ఇప్పుడు ‘నా జాతి’ అంటున్నవాళ్లు కూడా ఎస్వీఆర్ గురించి మాట్లాడకపోవడం విచారకరం. విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుని ఉండి ఉంటే ఊరూవాడా ముఖ్యమంత్రి కేసీఆర్ను కీర్తించేవారు. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసేవారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఊహించని విధంగా తమకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు అయినందుకు ఆ రాష్ట్రంలోని బ్రాహ్మణులు పట్టుమని పదిమంది కూడా ముఖ్యమంత్రిని అభినందించలేకపోయారు. అదే తెలంగాణ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొద్ది మాసాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే బ్రాహ్మణ సంఘాలు ముందుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆశీర్వదించాయి. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాయి. రెండు రాష్ట్రాల ప్రజల మనస్తత్వాలను విశ్లేషించడానికి ఇలాంటి ఉదంతాలు ఎన్నో! |