Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27318 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Friday, June 10, 2016 - 1:03 pm: | |
Kingchoudary:
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో సాక్షి ప్రసారాలను నిలిపిసినందుకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ఇటువంటి సమయంలో కూడా ఆయన తన ముఖ్యమంత్రి కలను మరిచిపోకుండా ‘ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి’ అని పదేపదే చెప్పడం చాలా ఆశ్చర్యం, వినోదం కూడా కలిగిస్తుంది. అసలు ఒక సీరియస్ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తన మనసులో ఆ కోరికని దాచుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ ఆయన ఏమ్మన్నారంటే “ఒక ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి కానీ ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా దానికి అర్ధం ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. లేకుంటే ఆ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి మాటలకి విలువ ఉండదు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ప్రజలలో తన విశ్వసనీయత కోల్పోతారు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తికి మాట నిలకడ చాలా అవసరం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం విషయంలో, తుని కేసు విషయంలో, కాపులకి రిజర్వేషన్ల విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు,” అని అన్నారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|