Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27269 Registered: 08-2008 Posted From: 119.56.121.68
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 09, 2016 - 9:16 am: | |
కాకినాడ : సాక్షి టీవీ, పత్రిక ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో మొదలవుతుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం సంచలన ప్రకటన చేశారు. అక్రమాస్తుల కేసులో అటాచ్డ్ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని యనమల చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఏపీలో స్పెషల్ కోర్టు పెట్టడానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపింది. దీన్ని పరిశీలించిన హోం మంత్రిత్వశాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆస్తుల స్వాధీనం ప్రక్రిను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక నిర్ణయానికి వచ్చింది. అవినీతి కేసులో రాష్ర్టానికి సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థల ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైనా వాటిని జప్తు చేస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ఈ చట్టం ద్వారా అధికారం సంక్రమిస్తుంది. ప్రస్తుతం రూ. 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్పై ఉన్న 11 చార్జిషీటుల నేపథ్యంలో సీబీఐ, ఈడీ ఈ రెండు కూడా జగతి పబ్లికేషన్స్తోపాటు జగన్కు చెందిన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|