Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27259 Registered: 08-2008 Posted From: 119.56.120.180
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, June 08, 2016 - 11:10 pm: | |
నక్సల్స్ను, టెర్రరిస్టుల్ని వదల్లేదా?: ముద్రగడ 09-06-2016 01:49:29 ఆనాడు చట్టాలు, రూల్స్ ఏమయ్యాయి? ‘తుని’ ఘటన కేసులు ఎత్తేయాల్సిందే లేదంటే నేటి ఉదయం నుంచే ఆమరణ దీక్ష ఈసారి విరమించను.. చర్చలకూ రావొద్దు: ముద్రగడ ఆయన దీక్షతో మరో ఆగస్టు సంక్షోభమే: కాపునాడు కిర్లంపూడి/ప్రత్తిపాడు, జూన్ 8: తుని సంఘటనలో అమాయకులపై కేసులు, అరెస్టుల కోసం చట్టాలు, రూల్స్ చెబుతున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో ఏజెన్సీలోని గుర్తేడులో ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసి ప్రముఖ నక్సలైట్ల నాయకులను విడిపించుకుని వెళ్లినప్పుడు ఈ చట్టాలు, రూల్స్ ఏమయ్యాయి? విశాఖపట్నంలో ఓ ఎమ్మెల్యేను నక్సలైట్లు కిడ్నాప్ చేయడంతో అప్పటి ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ.. నక్సలైట్లకు తలొగ్గి నిందితులను విడిపించలేదా? ఏలేశ్వరం పోలీస్స్టేషన్పై నక్సలైట్ల దాడి కేసులో 13 మందిపై కేసుపెడితే గొడవపడి విడిపించినప్పుడు రూల్స్ ఏమయ్యాయి? గతంలో టెర్రరిస్టులు భారత విమానాన్ని అఫ్గానిస్థాన్ తీసుకెళ్లి శిక్షపడిన ఉగ్రవాదులను విడిపించుకున్నప్పుడు ఈ రూల్స్ ఏమయ్యాయి’ అని ప్రశ్నించారు. చట్టాలు, రూల్స్ కచ్చితంగా అమలు చేస్తే దేశంలో చాలామంది జైలులో ఉంటారని చెప్పారు. అరెస్టు చేసిన ఏడుగురిపై కేసులు ఉపసంహరించుకోకపోతే గురువారం ఉదయం 9 గంటల నుంచి తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని పునరుద్ఘాటించారు. ఈ దఫా దీక్ష విరమించడం జరగదని, తనను అభిమానించే సోదరులెవరూ మధ్యవర్తిత్వం వహించవద్దని కోరారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందని గతంలో మాజీ ప్రధాని నరసింహరావు అన్నారు. ప్రస్తుతం చట్టం తన పని తాను చేయడం లేదు. అధికార పార్టీ నేతల జేబులో చట్టాలు చుట్టాలవుతున్నాయి. చట్టాలను శత్రువులపై ప్రయోగించడానికి, పేదవారిని అరెస్టుచేయడానికే ప్రయోగిస్తున్నారు’ అని ఆరోపించారు. తుని విధ్వంసకాండలో అమాయకులపై కేసులు నమోదు చేయవద్దని తాము డీజీపీకి లేఖరాశామని, అవసరమైతే ఆనాడు మీటింగ్కు వచ్చిన జనాన్ని పోలీసుల వద్దకు తీసుకొచ్చేందుకు తగిన మైదానాన్ని చూడాలని డీజీపీని కోరామని చెప్పారు. అయినప్పటికీ తనను ముద్దాయిగా తీసుకెళ్లేందుకు కిర్లంపూడిలో తన స్వగృహంపై హెలికాప్టర్లతో చక్కర్లు కొట్టించారని, తమ జాతిలో తనను అభాసుపాలు చేసే కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘తుని సభ జరుగకూడదని రెండు నెలల ముందు నుంచే అన్ని విధాలా ప్రయత్నించారు. నెల ముందు నాపై దాడికి కుట్ర చేశారు. అయినప్పటికీ కాపు జాతి గర్జించి తుని సభను విజయవంతం చేయడంతో కుట్రదారులు గిజగిజలాడారు. సభ జరుగుతున్న సమయంలో వేదికపై ఉన్నవారిని, పార్కింగ్ వాహనాలను తగులబెట్టాలని చూశారు’ అని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ సమస్యను నీరుగార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. కిర్లంపూడి, కోనసీమల్లో భారీగా బలగాలు తుని విధ్వంసం కేసులో అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను బుధవారం సాయంత్రంలోపు విడుదల చేయకపోతే గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కిర్లంపూడి, అమరావతి, కోనసీమ ఇతర ప్రాంతాలలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి సమీపంలో 500 మంది ప్రత్యేక పోలీసులతో పహరా ఏర్పాటుచేశారు. కిర్లంపూడి వైపు వచ్చే రహదారులపై తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడ, రాజమండ్రిల్లోనూ ప్రత్యేక దళాలను దించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న తన సతీమణి పద్మావతితో కలిసి నిరాహార దీక్ష చేసిన ముద్రగడ.. ఈ దఫా ఒక్కరే కూర్చోనున్నారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|