Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27133 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 02, 2016 - 9:28 am: | |
vaarni గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు గురై తల్లి మృతి చెందగా, తల్లి పాలు తాగిన చిన్నారి కూడా చనిపోయిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. లచ్చానుపల్లికి చెందిన లింగన్న, చంద్రకళ(28) దంపతులు.. తమ కుమారుడు వంశీ (ఏడాదిన్నర)తో కలిసి బుధవారం రాత్రి తమ పాత ఇంట్లో నిద్రించారు. అర్థరాత్రి సమయంలో చంద్రకళను పాము కాటేసింది. అది పాముకాటుగా దంపతులు అనుమానించలేదు. నిద్రలో ఏ పురుగో కుట్టిందనుకుని నిద్ర పోయారు. వారివద్ద నిద్రిస్తున్న వంశీ.. తల్లి పాలు తాగాడు. గురువారం తెల్లవారుజాము సమయంలో తల్లి, కొడుకు తీవ్రంగా నురగలు కక్కుకోవటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గుత్తి ఆస్పత్రిలో చంద్రకళ, అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వంశీ చనిపోయారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|