Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27101
Registered: 08-2008
Posted From: 119.56.126.174

Rating: N/A
Votes: 0

Posted on Sunday, May 29, 2016 - 10:40 pm:   

its official.


జగన్‌కు రాజ్యసభ ఎన్నికల వేడి
విహార యాత్రలకు శాసనసభ్యులు
కుటుంబాలతో సహా గోవా, కేరళ, శ్రీలంకలకు పయనం
సెల్‌ఫోన్లు స్విచాఫ్‌.. టీడీపీ నేతలతో మాట్లాడకుండా కట్టడి

కొత్త ఒరవడికి వైసీపీ అధ్యక్షుడి శ్రీకారం
హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన క్యాంపు రాజకీయాలు తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలకూ పాకాయి. రాజ్యసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు క్యాంపు రాజకీయాలను నెరపిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో లేదు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మొదటిసారి వీటికి బీజం వేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా ఆయన ఇతర రాష్ట్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను, వారి కుటుంబాలను విహార యాత్రలకు పంపారు. గతంలో అమెరికా, దుబాయ్‌ వెళ్లాలనుకున్న ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరించిన జగన్‌కు ఇప్పుడు తత్వం బోధపడినట్లు ఉంది. తన ధోరణి మార్చుకోకుంటే.. మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు దూరమవడమే గాక.. రాజ్యసభ స్థానం తన పార్టీకి దక్కకుండా పోతుందని.. అదే జరిగితే వైసీపీయే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన గ్రహించినట్లు తెలుస్తోంది. వైసీపీకి అసెంబ్లీలో ఉన్న 67 మందిలో 17 మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. మిగిలిన 50 మందిలో 40 మందిని విహార యాత్రలకు పంపారు. కొంతమంది ఎమ్మెల్యేలను గోవాకు, మరికొందరిని కేరళకు కుటుంబాలతో సహా పంపించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తాము శ్రీలంకకు వెళ్తామని జగన్‌కు చెప్పేశారు. ఇప్పటికే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సహా ఐదుగురు శాసనసభ్యులు విదేశాల్లో ఉన్నారు. గోవా, కేరళలకు తీసుకెళ్లిన శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు హైదరాబాద్‌ చేరుకుంటారో తెలియరాలేదు. పైగా.. సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేయాలని వారిని ఆదేశించారు. తెలుగుదేశం నాయకులతోనూ, ఇతర పార్టీల నేతలతోనూ మాట్లాడకుండా కట్టడి చేశారు. ఆయాచోట్ల వారికి సకల సదుపాయాలూ సమకూరుస్తున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్‌ 11న ఎన్నికలు జరుగనున్నాయి. సంఖ్యాబలం ప్రకారం టీడీపీకి మూడు, వైసీపీకి ఒక స్థానం దక్కే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో సహా క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు.. ఉదయం లేస్తే టూత్‌ బ్రష్‌ నుంచి రాత్రి భోజనాల వరకూ అంతా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థే చూసుకోవడం రివాజు. ఇప్పుడు జగన్‌ శిబిరాల్లోనూ ఇదే తంతు నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇలా క్యాంపు రాజకీయాల ద్వారా జగన్‌ కొత్త రాజకీయ ఒరవడికి తెరతీశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీకి రాజకీయంగా నష్టమే!
రాజ్యసభ ఎన్నికల్లో శిబిర రాజకీయాలకు తెరలేపడం వైసీపీకి రాజకీయంగా దెబ్బేనని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగుదేశం అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకముందే.. నాలుగో అభ్యర్థిని పోటీలో దింపుతారో లేదోనన్న విషయంలో స్పష్టత ఇవ్వకముందే ఎమ్మెల్యేల కట్టడికి పూనుకోవడం ద్వారా జగన్‌ తనలో దాగిఉన్న భయాన్ని బయట పెట్టుకున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలోని కొందరు సీనియర్‌ ఎమ్మెల్యేలు కూడా జరుగుతున్న రాజకీయ తతంగమంతా పార్టీని నష్టపరిచేదిగా ఉందంటున్నారు. పార్టీ ఆవిర్భావంతర్వాత తొలిసారిగా వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయంపై దృష్టి సారించి.. పార్టీ ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడి.. ఓటు వేయడానికి వారిలో అవగాహన కల్పించకుండా.. శిబిర రాజకీయానికి జగన్‌ పెద్దపీట వేయడం మంచి సంప్రదాయం కాదని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇలాంటి విధానాల వల్ల తన ఎమ్మెల్యేలపై జగన్‌కు విశ్వాసం లేదన్న అభిప్రాయం ఏర్పడుతుందని చెబుతున్నారు. శాసన సభ్యులు ప్రలోభాలకు లొంగిపోతారన్న అభద్రతా భావం జగన్‌లో ఉందన్న సంకేతాలూ వెళ్తాయంటున్నారు. ఇది పార్టీకి ఏ మాత్రం మంచిది కాదని కొందరు సీనియర్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration