Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26707 Registered: 08-2008 Posted From: 119.56.123.154
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 06, 2016 - 3:18 am: | |
edo tedaa kodataandi. ipadi nunde media support kosam trying annamaata. yerry interestng. waiting for fun time in 2019. నిర్భయం ఆంధ్రజ్యోతి నైజం 06-04-2016 02:08:07 వాస్తవాలు వెల్లడిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలి రాష్ట్ర విభజనతో పాఠకులకూ రెండు కార్లు: హరీశ్ రావు ‘ఆంధ్రజ్యోతి కార్ రేస్’ విజేతను ఎంపిక చేసిన మంత్రి విజేతగా నిలిచిన కరీంనగర్ జిల్లావాసి రాహుల్ విజేతను అభినందించిన హరీశ్, వేమూరి రాధాకృష్ణ హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): నిర్భయంగా నిజాలను వెల్లడిస్తూ ఆంధ్రజ్యోతి దిన పత్రిక అనతి కాలంలోనే ప్రజల పత్రికగా పేరు తెచ్చుకుందని, పాఠకులను ఆకట్టుకునేలా ముందుకు సాగుతోందని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ పది జిల్లాల ‘ఆంధ్రజ్యోతి కార్ రేస్’ బంపర్ డ్రా విజేత ఎంపిక మంగళవారం జూబ్లీహిల్స్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన హరీశ్రావు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ మేనేజింగ్ డైరెక ్టర్ వేమూరి రాధాకృష్ణతో కలిసి లక్కీ డ్రా తీసి విజేత పేరును ప్రకటించారు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం బాంకూరుకు చెందిన రాహుల్ విజేతగా నిలిచి కారు దక్కించుకున్నారు. అనంతరం రాహుల్కు హరీశ్రావు నేరుగా ఫోన్ చేశారు. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన విషయాన్ని తెలిపారు. ఉగాది కానుకగా ‘ఆంధ్రజ్యోతి’ మీకు కారును అందిస్తోందని తెలిపారు. ఆ తర్వాత ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ విజేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ పాఠకులను ఆకట్టుకునేలా ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగేలా.. ప్రజల కష్టాలు సర్కారుకు తెలిసేలా పత్రికలు వారధిలా పని చేయాలన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో రెండు రాష్ర్టాలకూ వేర్వేరుగా కార్లను బహుమతిగా ఇవ్వడం సంతోషం గా ఉందన్నారు. ‘‘గతంలో అయితే తెలు గు ప్రజలకు ఒకే కారు వచ్చేది. మీకు ఖర్చు పెరిగినా, రాష్ట్రం విడిపోయాక పాఠకులకు రెండు కార్లు వస్తున్నాయి’’ అని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ ఈడీ వేమూరి ఆదిత్య, సర్క్యులేషన్ డైరెక్టర్ రామకృష్ణారావు, నెట్వర్క్ ఇన్చార్జి కృష్ణప్రసాద్, ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|