Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99495 Registered: 03-2004 Posted From: 185.46.212.75
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 30, 2016 - 5:33 am: | |
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిజాం షుగర్స్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. ''నిజాం షుగర్స్ను ప్రైవేటీకరించొద్దని కోరితే చంద్రబాబు నన్ను కొట్టారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. తొలిసారి చెబుతున్నా. అప్పుడు షుగర్ మినిస్టర్, నేను పక్కపక్కన కూర్చున్నాం. నిజాం షుగర్స్ను ప్రైవేటీకరించొద్దని చేతులు జో డించి అడిగాను. అది మదర్ యూనిట్ అని, దాని ఆధారంగా పది యూనిట్లు వచ్చాయని చెప్పాను. వాటి నష్టాలను దీనిమీద రుద్దొద్దని అడిగాను. అంతే, చంద్రబాబు లేచి ఒక్కసారిగా నా తొడమీద కొట్టారు. ధోతి వేసుకుంటా కదా, అక్కడంతా ఎర్రగా అయ్యింది'' అని ఆయన తెలిపారు. ఇన్నాళ్లబట్టి తాను ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని అన్నారు. అయితే.. దీనిపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు కొట్టినా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. దానికి పోచారం శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ, తెలంగాణకు రూపాయి కూడా ఇచ్చేది లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మీరెందుకు కొనసాగారని ప్రశ్నించారు. |