Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26609 Registered: 08-2008 Posted From: 58.182.200.24
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 29, 2016 - 1:30 pm: | |
Fanno1:
ఎమ్మెల్యేలకు డబుల్ ధమాకా - నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.3 కోట్లకు పెంపు - అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్యే నియోజక వర్గ అభివృద్ధి నిధులను రూ. 3 కోట్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. అధికార, ప్రతి పక్ష ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను పెంచాలని, ప్రస్తుతం ఇస్తున్న రూ. 1.5 కోట్లు సరిపోవడం లేదని చెబుతున్న నేపథ్యంలో రూ. 3 కోట్లకు పెంచుతున ్నట్లు వెల్లడించారు. వెంటనే వీటికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తామని తెలిపారు. నిధులను ఖర్చు చేసే పూర్తి అధికారం ఎమ్మెల్యేలకు ఇస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల వ్యధిలోనే అటు జీతభత్యాలతోపాటు ఇటు నియోజకవర్గాల అభివృద్ధి నిధులు పెరగటం ఎమ్మెల్యేలకు డబుల్ ధమాకా అనే చెప్పవచ్చు. మంగళవారం అసెంబ్లీలో టీ బ్రేక్ తరువాత ప్రారంభమైన సభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ. 5 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఎంఐఎం, బీజేపీ, వైఎస్సార్ సీపీ, సీపీఐ పక్షాలు కూడా సమర్థించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అందరూ ఏకగ్రీవంగా అడుగుతున్నారని, అయితే నియోజకవర్గ అభివృద్థికి రూ. 5 కోట్లు ఇవ్వలేమని, సాధారణ నిధుల(రూ.కోటికి) కు తోడు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధుల్లోంచి కొంత మొత్తాన్ని కలిపి మొత్తం రూ. 3 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే అధికార, ప్రతిపక్ష, అన్ని పార్టీల ఎమ్మెల్యేలంతా నిధులను పెంచాల్సిందేనని పట్టుబట్టడంతో రూ. 3 కోట్లు కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మిషన్ కాకతీయ పనులు పూర్తి చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రోటోకాల్ తేడా రావద్దు ఎమెల్యేల ప్రోటోకాల్ విషయంలో సీఎం కేసీఆర్మాట్లాడుతూ సీఎస్ కంటే ఎమ్మెల్యేలే ప్రోటోకాల్ పరంగా ముందుంటారన్నారు. కొన్ని శాఖలు ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని, నిరక్ష్యం చేస్తున్నారని, ఇదీ దుర్మార్గమన్నారు. ఈనెల 31లోగా అన్ని పార్టీల సభ్యులను పిలిచి సమావేశం నిర్వహించాలని స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్పై వివరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని, జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర స్థాయిలోనూ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఏ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించినా, మంత్రులు నిర్వహించినా ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా గౌరవించాలని, వారిని పిలువాలన్నారు. గొడవలు అవసరం లేదన్నారు. సీఎంకు ధన్యవాదాలు: స్పీకర్ గొప్ప మనసుతో ఎమ్మెల్యేలను అర్థం చేసుకొని అభివృద్ధి నిధులను పెంచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారృ . అన్ని పార్టీల ఎమ్మెల్యేల తరపున, సభ తరపున సీఎంకు అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రతి పక్ష నేత జానారెడ్డి కూడా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|