Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1634 Registered: 10-2005 Posted From: 73.185.138.54
Rating: N/A Votes: 0 | Posted on Thursday, February 04, 2016 - 3:29 pm: | |
ముస్లింల ఆక్రమణతో యుద్ధాలు 2043 నాటికి మరుభూమిగా యూరప్ బల్గేరియా ‘నోస్ట్రడామస్’ బాబా వాంగ పన్డేవా జోస్యం 9/11 ఉదంతాన్ని ముందే చెప్పిన పన్డేవా రాజీవ్, ఇందిర హత్యలపైనా నిజమైన జోస్యం యూరప్ ను 2016లో ముస్లింలు ఆక్రమించుకుంటారు! 2018నాటికి అమెరికాను వెనక్కి నెట్టి.. చైనా సూపర్ పవర్ అవుతుంది! అమెరికాలోని ట్విన్ ట్వవర్స్ను విమానాలతో కూల్చేస్తారని 1989లోనే చెప్పిన బల్గేరియా మహిళ బాబా వాంగ పన్డేవా.. జోస్యాలివి! ఈ ఏడాదికి సంబంధించి ఆమె చెప్పిన జోస్యంపై చర్చలతో మళ్లీ ఆమె పేరు వార్తల్లోకొచ్చింది. ‘‘2016లో యూర్పపై ముస్లింలు దాడి చేస్తారు. ఇది యుద్ధానికి దారి తీసి యూర్పలోని జనమంతా మృత్యువాత పడతారు’’ అని పన్డేవా 1996కు ముందే చెప్పారు. సిరియాలో ‘గ్రేట్ ఇస్లామిక్ వార్’ మొదలై 2043 నాటికి రోమ్పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని చెప్పారు. 12 ఏళ్లకే అంధత్వం బల్గేరియాలోని పెట్రిచ్ నగరంలో 1911, జనవరి 31న పన్డేవా జన్మించారు. 1996 ఆగస్టు 11న మరణించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయినా.. ప్రాణాలతో బయటపడ్డారు. కళ్లలో ఇసుక పడటంతో చూపు పోయింది. 16వ ఏట నుంచే భవిష్యవాణి మొదలుపెట్టారు. తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఉన్న చోటును అన్ని వివరాలతో ఊహించి ఆమె తొలిసారిగా జోస్యం చెప్పారు. 30 ఏళ్లు వచ్చేసరికి ఆమె అతీంద్రియ శక్తులు మరింత బలోపేతం అయ్యాయని ఆ దేశవాసులు నమ్ముతారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం కావడంతో ఆమెను ‘నోస్ట్రడామస్ ఆఫ్ ద బాల్కన్స్’గా పిలుస్తున్నారు. జర్మనీ నియంత హిట్లర్ సైతం ఓసారి పన్డేవాను పిలిచారని, ఆందోళనకు గురైన ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయారని చెబుతారు. రెండో ప్రపంచయుద్ధంతో పాటు అనేక సంఘటనలను ముందే ఊహించి పన్డేవా చెప్పిన జోస్యాల్లో 68 శాతం వరకూ నిజమయ్యాయని చెబుతారు. నిజమైన జోస్యాల్లో కొన్ని.. అమెరికా అధ్యక్షుడు కెన్నడీ, భారత ప్రధానులు ఇందిర, రాజీవ్ హత్యల గురించీ ముందే చెప్పారు. ‘లోహ విహంగాల దాడితో అమెరికా సోదరులు(ట్విన్ టవర్స్) కూలుతారు. పొద(అప్పటి అధ్యక్షుడు ‘బుష్’ను ఉద్దేశించి)లో తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం పారుతుంది’ అంటూ 2001, సెప్టెంబరు 11న ట్విన్టవర్స్ కూల్చివేత గురించి 1989లోనే చెప్పారు. ‘‘ఓ పెద్ద అల తీరాన్ని కమ్మేస్తుంది. గ్రామాలు, ప్రజలు జలసమాధి అవుతారు’’ అంటూ 2004లో థాయి తీరంలో సునామీ గురించి జోస్యం చెప్పారు. ఆగస్టు 1999 లేదా 2000లో కురుస్క్ నీటిలో మునిగిపోతుంది. ప్రపంచం కలవరానికి గురవుతుందని 1980లో చెప్పారు. 2000 ఆగస్టులో రష్యాకు చెందిన ‘కురుస్క్’ అణు జలాంతర్గామి సముద్రంలో ప్రమాదానికి గురికావడంతో ప్రపంచదేశాలు వణికిపోయాయి. బల్గేరియా రాజు బోరిస్-3 ఆగస్టు 28, 1943న చనిపోతారని చెప్పగా.. 1944 ఆగస్టు 28న చనిపోయారు. భవిష్యత్ జోస్యాలివే.. 2018లో శుక్రుడిపైౖ కొత్త ఇంధనం కనుగొంటారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుంది. 2023లో భూమి కక్ష్య మారుతుంది. దీనివల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్రాలు పొంగుతాయి. మధ్యప్రాచ్యం వేడితో కుతకుతలాడుతుంది. సిరియాలో మొదలయ్యే గ్రేట్ ఇస్లామిక్ వార్.. 2043లో రోమ్ను స్వాధీనం చేసుకోవడంతో ముగుస్తుంది. యూర్ప ప్రజలంతా మృత్యువాతపడి.. జీవమన్నదే లేకుండా మరుభూమిగా మారిపోతుంది. 2130లో నీటిలో నివసించేలా గ్రహాంతరవాసులు మనుషులకు సాయం చేస్తారు. 3005లో అంగారకుడిపై యుద్ధం జరుగుతుంది. చంద్రుడిని తోకచుక్క ఢీకొంటుంది. భూమి చుట్టూ రాళ్లు, బూడిద వలయం ఆవరిస్తుంది. 3797నాటికి భూమిపై మనిషి మిగిలి ఉండడు! కానీ.. అప్పటికి కొత్త సౌరకుటుంబానికి వెళ్లేంత సత్తాను సాధిస్తాడు. ఆఖరుగా.. 5079లో ఈ విశ్వం అంతమవుతుంది. |