Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25782
Registered: 08-2008
Posted From: 119.56.123.97

Rating: N/A
Votes: 0

Posted on Monday, February 01, 2016 - 3:22 am:   

బెంగళూరు: తెల్లవారితే పెళ్లి. వధూవరుల కుటుంబాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి. వచ్చిపోయే వారితో కల్యాణమండపం కళకళలాడుతోంది. తెల్లవారుజామునే వివాహం కావడంతో వరుడి కుటుంబం రాత్రే కల్యాణమండపానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఒక్కటి కాబోతున్న పెళ్లికొడుకు, పెళ్లికూతురు కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. కానీ అప్పుడే జరగకూడని సంఘటన జరిగింది. భోజనంలో రసం వడ్డించలేదని పెళ్లికొడుకు కాస్తా అక్కడి నుంచి పరారయ్యాడు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా కుణిగల్‌లో జరిగిందీ ఘటన.
కుణిగల్‌కు చెందిన కేపీ సౌమ్యకు, శ్రీరామపురకు చెందిన రాజుకు వివాహం నిశ్చయమైంది. ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటలకు వివాహం. శనివారం అర్ధ రాత్రి దాదాపు 12 గంటల సమయంలో వరుడి కుటుంబం కల్యాణమండపానికి చేరుకుంది. ఆకలిగా ఉంది భోజనం వడ్డించమంటూ వరుడితోపాటు కుటుంబ సభ్యులందరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం మధ్యలో రసం కావాలంటూ వరుడి తల్లి అడిగింది. అయితే రసం అయిపోయిందని వధువు తరపు వారు సమాధానం ఇచ్చారు. అంతే వరుడు రాజు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి తల్లి, కుటుంబ సభ్యులు జతకలిశారు. ఇంకేముంది వధువు కుటుంబంపై దుమ్మెత్తిపోశారు. ఇష్టం వచ్చినట్టు దూషించారు. వధువు తల్లిదండ్రులు సర్దిచెబుతున్నా వినిపించుకోలేదు. రాత్రంతా అదే పనిగా వారు దూషణ పర్వం కొనసాగించారు. పెళ్లి ఘడియలు సమీపిస్తున్న తరుణంలో కుటుంబంతో సహా పెళ్లి కొడుకు పరారయ్యాడు. వారికోసం ఎంతవెతికినా ఫలితం లేకుండా పోయింది. సౌమ్యతోపాటు కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. కుటుంబం పరువు ఏం కావాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. దు:ఖంలో మునిగిపోయిన వధువు కుటుంబ సభ్యుల వద్దకు ఓదార్చేందుకు వచ్చిన గోవిందరాజు అనే యువకుడు.. వారు అనుమతిస్తే సౌమ్యను తాను పెళ్లాడతానంటూ ముందుకొచ్చాడు. దీనికి పెద్దలందరూ సంతోషంగా అంగీకరించడంతో అనుకున్న ముహూర్తానికే సౌమ్య, గోవిందరాజుల వివాహం జరిపించారు. అనంతరం పెళ్లిపెద్దలందరూ కలిసి పారిపోయిన వరుడు, అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration