Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99244 Registered: 03-2004 Posted From: 185.46.212.69
Rating: N/A Votes: 0 | Posted on Thursday, January 21, 2016 - 9:07 am: | |
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై కక్షసాధింపు ధోరణిని కొనసాగిస్తోంది. ఇప్పటికే అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మరో కేసులో గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. 2009లో జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ గోడలపై రాతలు రాయించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి చిత్తూరు జిల్లా పీలేరు కోర్టుకు చెవిరెడ్డిని తరలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ....ప్రభుత్వ కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్ జగన్ నాయకత్వంలో ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమ కేసులో చెవిరెడ్డిని సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. Over gaa velthunnaru veedi meeda, ilaa cheyyadam avasaram ledhu.... |