Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24659
Registered: 08-2008
Posted From: 183.90.116.212

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, October 14, 2015 - 8:11 am:   

గుండెపోటుతో ఇద్దరు అభిమానుల మృతి
Sakshi | Updated: October 14, 2015 02:51 (IST)

జగన్ ఆరోగ్యం క్షీణించిందని ఒకరికి గుండెపోటు
దీక్ష భగ్నం చేయడంతో హోదా రాదని మరొకరి మృతి

నాగులుప్పలపాడు/ కర్లపాలెం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించిందని ఒక అభిమాని, దీక్షను భగ్నం చేయడంతో ఇక రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదనే ఆవేదనతో మరో అభిమాని గుండెపోటుతో మృతిచెందారు. ఆరు రోజులు నిరాహార దీక్ష చేసిన జగన్ ఆరోగ్యం బాగా క్షీణించి ఆందోళనకరంగా ఉన్నట్లు టీవీల్లో వస్తున్న వార్తలు చూసి ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడుకు చెందిన జగన్ అభిమాని ముంగర నాగేశ్వరరావు (57) భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆయనకు సోమవారం రాత్రి 12 గంటల సమయంలో గుండెపో టు వచ్చింది.

కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సందర్శించి నివాళులర్పించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నర్రావారిపాలేనికి చెందిన నంగు చినవెంకటసుబ్బారెడ్డి(42)మంగళవ� ��రం ఉదయం భార్య లక్ష్మితో కలసి టీవీ చూస్తున్నాడు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేస్తున్న దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలను వీక్షిస్తూ... ఇక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావని భార్యతో చెబుతూ కుప్పకూలి పడిపోయాడు.

కంగారుపడిన భార్య గ్రామస్తుల సహకారంతో భర్తను కర్లపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతని పరిస్థితి విషమించటంతో పొన్నూరులోని మరో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతను గుండెపోటుతో మృతిచెందాడని నిర్ధారించారు. స్వతహాగా వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని అయిన చిన వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, కుమార్తెలు శిరీష, ఝాన్సీ ఉన్నారు. సుబ్బారెడ్డి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి, పలువురు వైఎస్సార్ సీపీ నేతలు నర్రావారిపాలెం వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration