Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24579 Registered: 08-2008 Posted From: 183.90.116.212
Rating: N/A Votes: 0 | Posted on Sunday, October 11, 2015 - 8:54 am: | |
బాగా నీరసించిన వైఎస్ జగన్ Sakshi | Updated: October 11, 2015 17:18 (IST) గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం శరీరాన్నే సాధనంగా మార్చుకొని నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా నీరసించిపోయారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో ఆదివారం వైద్యులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికీ ఉదయం నుంచి మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత ఐదు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్ రెండు కిలోల బరువు తగ్గారని, దీక్షకు ముందు ఆయన బరువు 75 కిలోలు ఉండగా, ప్రస్తుతం 73.4 కిలోలు ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో గంటగంటకు ఆయన శరీరంలోని బీపీ, షుగర్, పల్స్ స్థాయిల్లో మార్పు వస్తుందని చెప్పారు. దాదాపు 97 గంటలుగా ఎలాంటి ఆహారం లేక పోవడంతో జగన్ బాగా నీరసించిపోయారు. ఈ నేపథ్యంలో సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. |