Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1414 Registered: 10-2005 Posted From: 68.46.89.119
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, June 10, 2015 - 3:41 am: | |
ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో అసలు ఫోన్ ట్యాపింగే జరగ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారా!? నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంటిపై ఏసీబీ అధికారులు కేవలం నిఘా పెట్టారని మాత్రమే వివరించారా? ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలతో ఢిల్లీ వస్తున్నానని చెప్పారా!? ఈ మేరకే ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే జవాబు ఇస్తున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు! తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్కు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ‘‘ఒక ముఖ్యమంత్రి ఫోన్ను ట్యాప్ చేస్తే మీరేమి చేస్తున్నారు?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో, హైదరాబాద్లో ఎలాంటి ట్యాపింగూ జరగలేదని గవర్నర్ ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లను తెలంగాణ సీఎం కేసీఆర్ ట్యాప్ చేయించలేదని, ఈ మేరకే తాను తన నివేదికలో వివరిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. స్టీఫెన్సన్ చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఆయన ఇంటిపై నిఘా పెట్టిందని, ఈ క్రమంలోనే చంద్రబాబుకు, ఆయనకు మధ్య జరిగిన సంభాషణ బయటకు వచ్చిందని నరసింహన్ తన నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. అవినీతిపై సమాచారం వచ్చినప్పుడు ఏసీబీ నిఘా వేస్తుందని, ఆ విషయాన్ని తనకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా గవర్నర్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. చంద్రబాబుపై ఏసీబీ అనుబంధ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే మాత్రం దర్యాప్తునకు తన అంగీకారం అవసరమని పొందుపరిచినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రమే మార్గదర్శకత్వం అందించాలని గవర్నర్ రాజ్నాథ్సింగ్ను కోరినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలతో ఢిల్లీ వస్తున్నానని కూడా ఆయన రాజ్నాథ్కు చెప్పారు. మంగళవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న నరసింహన్.. బుధ, గురువారాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్లను కలుసుకోనున్నారు. రేవంత్పై స్టింగ్ ఆపరేషన్పై నివేదిక ఇవ్వడం లేదని విలేకరులకు గవర్నర్ చెప్పడం గమనార్హం. |