Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7350 Registered: 03-2004 Posted From: 68.32.65.38
Rating: N/A Votes: 0 | Posted on Saturday, February 28, 2015 - 11:46 pm: | |
some thoughts from RK మొత్తంమీద కాంగ్రెస్- బీజేపీలు నేరం చేయగా, శిక్ష మాత్రం ఏపీ ప్రజలు అనుభవించవలసి వస్తోంది. విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయాలని ఏపీ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. పోరాటం చేయడానికి కేంద్రం ఏమైనా పాకిస్థానా? అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ హామీల అమలు కోసం కేంద్రంతో పోరాడటమా? అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఐక్యంగా ఒత్తిడి తేవడమా? అన్నది ఇప్పుడు తేలవలసి ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సొంతంగానే తగినంత మెజారిటీ ఉంది కనుక పోరాడితే వచ్చే ప్రయోజనం ఏమీలేదు. మహా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు తప్పుకుంటారు. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే? ఉండదనే చెప్పాలి. మిగిలిన ప్రత్యామ్నాయం- కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఎంతో కొంత సాధించుకోవడమే! జరిగినదానికి బాధ్యత వహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు కనుక జరగబోయే దానికైనా అన్ని పక్షాలు కలిసి ఉమ్మడిగా కృషి చేయడం అవసరం. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉన్నందున రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ప్రయత్నిస్తే ఉపయోగం ఉండదని తెలుసు కోవాలి. తమపై ఏపీ ప్రజలకు ఉన్న కోపం పోవాలంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చేయవలసింది పోరాటాలు కాదు. తమ అధినేత్రి సోనియాగాంధీని ప్రయోగించి కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి ఎన్నో కొన్ని సాధించుకోవాలి. భూసేకరణ ఆర్డినెన్స్ స్థానే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు వంటి వాటికి ఆమోదం పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కేంద్రప్రభుత్వానికి అవసరం. ఈ పరిస్థితిని అనువుగా చేసుకుని నరేంద్రమోదీ నుంచి నిర్దిష్ట సహాయం పొందడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించాలి. అలా చేయగలిగితేనే ఏపీ ప్రజలు కాంగ్రెస్ను మన్నించి అక్కున చేర్చుకుంటారు. |