Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7341 Registered: 03-2004 Posted From: 76.122.133.243
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 24, 2015 - 6:39 am: | |
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 24 : 14వ ఆర్ధిక సంఘం సమర్పించిన నివేదికను పార్లమెంట్ ఆమోదించిందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. మంగళవారం ఈ అంశమై జైట్లీ మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టాలు ఆర్ధికంగా బలోపేతం కావాలన్నారు. పన్నుల్లో రాష్ర్టాలకు 42 వాటా ఇవ్వాలని, మరో 4-5 శాతం స్థానిక సంస్థల ద్వారా ఇవ్వాలని 14 ఆర్ధిక సంఘం సూచించిందని ఆయన తెలిపారు. దీని ప్రకారం గతంలో కన్నా 10 శాతం వాటా అధికంగా రాష్ర్టాలకు లభించనుందన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ర్టాల్లో 1,94,021 కోట్లు రెవెన్యూ లోటు ఉందని, ఆర్ధిక మంత్రి తెలిపారు. ఆర్ధిక లోటు ఉన్న ఏపీ లాంటి రాష్ర్టాలను ఆదుకోవచ్చని ఆర్ధిక సంఘం ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాలకు కలిపి 11,89,037 కోట్ల గ్రాంటును ఆర్ధిక సంఘం ప్రకటించింది. వీటిల్లో.. ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్లకు రూ. 1,41,467 కోట్లు, తెలంగాణకు రూ. 20,951 కోట్ల గ్రాంటును, ప్రకటించింది. అంతేకాకుండా సాధారణ పన్నుల్లో ఏపీకి 4.305 శాతం, తెలంగాణకు 2.437 శాతం కేటాయింపులు, సర్వీస్ టాక్స్లో ఏపీకి రూ. 4.998 శాతం, తెలంగాణకు 2.4 శాతం కేటాయించాలని ఆర్ధిక సంఘం ప్రతిపాదించింది. ఆర్ధిక సంఘం ప్రకటించిన గ్రాంటు ప్రకారం.. ఏపీకి ఏటా రూ. 30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లపాటు కేంద్ర సాయం అందుతుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందని, ఏపీలో రెవెన్యూ లోటును దృష్టిలో ఉంచుకుని ఆర్ధిక సంఘం పైవిధంగా సిఫారసు చేసిందని ఆయన చెప్పారు. పునర్విభజన సందర్భంగా ఏపీకి లోటు బడ్జెట్ ఏర్పడిందని, ఏపీని కేటాయింపులు జరపాల్సిందిగా చట్టంలో కూడా ప్రతిపాదనలున్నాయన్నారు. |