Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7320
Registered: 03-2004
Posted From: 76.122.133.243

Rating: N/A
Votes: 0

Posted on Saturday, February 14, 2015 - 8:21 pm:   

on KCR

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విషయానికి వద్దాం! ప్రభుత్వ నిర్వహణలో ఉపకరించడం కోసమని ఆయన పలువురు సలహాదారులను నియమించుకున్నారు. తమ సలహాలు వినేవారులేక వారంతా ప్రస్తుతం గోళ్లు గిల్లుకుంటున్నారు. వాస్తు విషయంలో మాత్రమే ప్రస్తుతానికి కేసీఆర్‌ సలహాలు స్వీకరిస్తున్నారు. ‘సీతయ్య ఎవరి మాట వినడు’ అన్నట్టుగా కేసీఆర్‌ ఎవరి మాటా వినరు! ముఖ్యమంత్రిగా ఎనిమిది మాసాలుగా ఆయనను గమనిస్తున్న వారెవ్వరూ ఆయనకు సూచనలు ఇవ్వడానికి ధైర్యం చేయడం లేదు. తనకు కావాలనుకున్నప్పుడు మాత్రం ‘మీరంతా సూచనలు చేయండి. అందరం కలిసి నిర్ణయాలు తీసుకుందాం’ అంటారు. అంతా ఉత్తదే! నిన్నగాక మొన్న ముఖ్య కార్యదర్శులందరినీ పిలిచి భోజనం పెట్టి మరీ గంటలకొద్దీ ఉపన్యాసం ఇచ్చి పంపారు. కుటుంబ సభ్యులైన కేటీఆర్‌, కవిత మాట ఆయన వింటారని చాలా మంది భావిస్తారుగానీ అందులో కూడా వాస్తవం లేదు. కూతురైనా, కొడుకైనా ఆయన మనస్సు ఎరిగి ప్రవర్తించాలేగానీ ఎదురు చెప్పడానికి ఉండదు. ఆ మధ్య అధికారులతో ఏర్పాటు చేసిన ఒక సమీక్షా సమావేశంలో కేసీఆర్‌ చెవిలో ఏదో చెప్పటానికి కేటీఆర్‌ ప్రయత్నించారు. అంతే- ఆగ్రహం చెందిన కేసీఆర్‌ - ‘రారా నువ్వే ఈ కుర్చీలో కూర్చో. నేనే పోతాను. నువ్వే పాలించు’ అని అందరి ముందు ఈసడించుకున్నారు. తెలంగాణలో రెండు చానెళ్లను నిషేధించడం మంచిది కాదనీ, అందరితో సఖ్యతగా ఉండటం మేలనీ సలహా ఇచ్చిన పాపానికి ఒక పారిశ్రామికవేత్తకు ఎంట్రీ లేకుండాపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడని అందరూ భావిస్తారు. వాస్తవం మాత్రం ఇది! తెలంగాణలో తనకు, తన పార్టీకి తిరుగులేదని కేసీఆర్‌ భావిస్తారు. అందుకే ఎవరి మాటను ఆయన లెక్కచేయడం లేదు. ఎనిమిది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలోని మొత్తం స్థానాలను గెల్చుకున్న బీజేపీ శాసనసభ ఎన్నికలలో మాత్రం మూడు స్థానాలకే పరిమితమయ్యింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఇప్పుడు అధికారంలో ఉండవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం! రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. కేసీఆర్‌కు ఈ విషయం తెలియదనుకోవడం పొరపాటు. ఉద్యమ సందర్భంగా ఆయన ఎన్నో గెలుపోటములను చవిచూశారు. అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా మార్పు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కదా! అధికారం అనేది కళ్లు, చెవులను మూసేస్తుంది. వాస్తవాలను చూడటానికి, వినడానికి అంగీకరించనివ్వదు. అందుకే కేసీఆర్‌ చర్యలే కాకుండా ఆయన వ్యవహారశైలి కూడా ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యింది. తెలంగాణలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షం లేదని భ్రమిస్తూ ఉండవచ్చు. ఢిల్లీలో సామాన్యుడిని అందలం ఎక్కించిన ప్రజలు ఇక్కడ మాత్రం అలా చేయరని గ్యారంటీ ఏమిటి? కంటికి కనిపించే నాయకులు కాదు- కనిపించని ప్రజలే నిజమైన ప్రతిపక్షం. ఈ సత్యాన్ని అధికారంలో ఉన్నవారు గ్రహించాలి.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration