Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2694 Registered: 08-2020
Rating: Votes: 2 | Posted on Monday, June 07, 2021 - 3:07 pm: | |
రాజీవ్ గాంధీ దేశమంతా తిరిగి ప్రచారం చేస్తే, ఎన్నికల ఫలితాలు తర్వాత పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. సుశీల్ కుమార్ షిండే పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే విలాస్ రావ్ దేశముఖ్ ముఖ్యమంత్రి అయ్యాడు. జయలలిత చెమటోడ్చి అధికారాన్ని సాధిస్తే పన్నీర్ సెల్వం, పళని స్వామి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో కాంగ్రెస్ పార్టీని కేవలం 24 సీట్లకే పరిమితం చేసిన ఎన్టీఆర్ స్థానంలో, సంవత్సరం తిరిగే సరికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఒంటిచేత్తో మహా కూటమి ఓడించి, రెండోసారి కాంగ్రెస్ ని గెలిపిస్తే, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1989లో తెలుగు దేశాన్ని ఓడించే వ్యూహంలో భాగంగా పిసిసి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి పీపుల్స్ వార్ సహకారంతో కాంగ్రెస్ను గెలిపించి నప్పటికీ, సంవత్సరం తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన తర్వాత విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. సారాంశం ఏంటంటే... ఒండినోడు(మాత్రమే) ఒక్కడే తినాలి అని రూలేమీ లేదు. ఆ గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటే... వాళ్లకే ప్రాప్తం. ఇది ఫిలాసఫీ కాదు...... చరిత్ర. |