Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Medical_miracle
Kurra Bewarse
Username: Medical_miracle

Post Number: 2681
Registered: 08-2020

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, June 02, 2021 - 11:42 am:   

sujana birthday eeroju.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఎపి కోసం ఒక్కడు
ఎపిలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కి నియంతృత్వ పోకడలు పోతున్న ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు ఎవరూ సాహసించని పరిస్థితుల్లో, బాధితులకు అండగా నేనున్నానంటూ ఒక్కడొచ్చాడు.
నియంత ప్రభుత్వం ఒక ప్రాంతంపై కక్ష కట్టి, అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఉద్యమించిన రైతులకు అండగా ఒక్కడొచ్చాడు.
పేరుమోసిన నేతలంతా ఉపన్యాసాలకే పరిమితమైనప్పుడు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అమరావతి రైతులకు న్యాయసహాయం అందించేందుకు అండగా నిలిచాడు. వారి భారాన్ని పంచుకున్నాడు. ఇప్పటికీ అమరావతి ఉద్యమనేతలు సలహాలకు, సంప్రదింపులకు చూసేది ఆ ఒక్కడి వైపే.
ఎపి అభివృద్ధిని కాంక్షిస్తూ డిప్యూటేషన్ పై ఇడిబి సియివోగా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ పై నియంత ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే ఆయనకు అండగా వుండి, ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా పోరాడింది ఆ ఒక్కడే.
రాజ్యాంగబద్ధ పదవిలో వున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియంత ప్రభుత్వం వేధించినప్పుడు ఆయనకు అండగా నిలబడి, న్యాయపరమైన సలహా, సహాయాలు చేసింది ఆ ఒక్కడే.
నియంత ప్రభుత్వం వ్యవస్థలను దెబ్బతీసి, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నప్పుడు, మహామహులంతా చేష్టలుడిగి చూస్తుంటే, తన శక్తి మేరా అడ్డుకోడానికి ధైర్యంగా ముందుకు వచ్చిందీ ఆ ఒక్కడే.
విపక్ష నేతలను వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా నియంతప్రభుత్వం ఇబ్బందిపెట్టినప్పుడల్లా పార్టీలకతీతంగా వారికి కనిపించేది, వారికి ధైర్యం చెప్పేది ఆ ఒక్కడే.
కొవిడ్ రోగులు తెలంగాణలో ప్రవేశించలేక, సరిహద్దుల్లో అంబులెన్సుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, పక్క రాష్ట్ర సీఎంతో మాట్లాడే ఖలేజాలేని నియంతపాలకులు కళ్లు మూసుకుంటే, కోర్టుకెళ్లి అంబులెన్సులకు దారి చూపి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడింది ఆ ఒక్కడే.
కొవిడ్ తొలి దశలో లాక్ డౌన్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ఫౌండేషన్ ద్వారా దాదాపు 5 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించిందీ ఆ ఒక్కడే.
రెండో దశలో విజయవాడలో తన కన్వెన్షన్ సెంటర్ను కొవిడ్ కేంద్రంగా మార్చి రోగుల భోజనాలకు, ఇతర సౌకర్యాలకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నదీ ఆ ఒక్కడే.
రాజకీయ, కుల, మత వివక్ష లేకుండా ఎంతో మందికి విద్య, ఆరోగ్య, ఉపాధి పరంగా సాయం చేస్తున్నదీ ఆ ఒక్కడే.
చీమంత చేసి కొండంతగా మీడియా మైకుల ముందు చెప్పుకునే నేతలున్న ఈ కాలంలో ఏ మాత్రం ప్రచారం ఆశించకుండా, తెరవెనకే వుండి ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు అడ్డుకట్ట వేయడం దగ్గర్నుంచి, అవసరమైన వారికి సాయం చేసేంత వరకు ఆయన ప్రచారాన్ని ఆశించలేదు. మాటలు తక్కువ. చేతలు ఎక్కువ. తన మనసులో వున్నది సూటిగా చెప్పే భోళాతనం ఆయన సొంతం.
సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ, భవిష్యత్తుపై భరోసాలేని ఆంధ్రులకు నేనున్నానంటూ ప్రతి సందర్భంలో ముందుకొస్తున్న ఆ ఒక్కడే కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి. నేడు ఆయన జన్మదినం సందర్భంగా భావి జీవితం సంతోషంగా, పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా వుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration