Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1919 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Sunday, March 08, 2020 - 10:15 am: | |
కామెడీ చూడటం హ్యాపీగానే ఉంటుంది. కామెడీ పండించటం కష్టం. అయితే, కామెడీనే పెట్టుబడిగా పెట్టి... బిజినెస్ చేయటం అన్నిటికంటే పెద్ద రిస్క్. ఇప్పుడలా 'అదరగొట్టేద్దా'మని భావించిన ఓ మెగా జడ్జ్... విమర్శలపాలవుతున్నాడు. 'అదిరింది' ... ఓ రేంజు అంచనాల మధ్య ఈ షో మొదలైంది. అందుకు ప్రధాన కారణం జడ్జ్ నాగబాబు. ఈయన 'జబర్దస్త్' వదిలి 'అదిరింది' కోసం వచ్చాడు. వస్తూ వస్తూ విమర్శల వర్షం కురిపించాడు. దాంతో కొత్త షో 'అదిరింది'... అమాంతం పాపులర్ అయిపోయింది. కానీ, బుల్లితెరపై ప్రసారం అవ్వటం మొదలయ్యాక ఆశించిన సంచలనం సాధ్యం కాలేదు. 'జబర్దస్త్' నిర్వాహకులు కొందరు కమెడియన్స్కి అన్యాయం చేశారని ఆరోపించిన నాగబాబు 'అదిరింది' ప్రారంభించటానికి బలమైన కారణమే చూపించాడు. అయితే, నాగబాబుపై గుర్రుగా ఉన్న 'జబర్దస్త్' ప్రొడ్యూసర్స్ కూడా ఎత్తుకు పైఎత్తు వేశారు. ఆదివారం నాడు సరిగ్గా 'అదిరింది' ప్రసారం అయ్యే సమయంలోనే 'జబర్దస్త్' ఓల్డ్ ఎపిసోడ్స్ పునః ప్రసారం చేస్తున్నారు. చివరకు, 'అదిరింది' అదరగొట్టలేకపోయింది. యావరేజ్ టాక్ రావటంతో నాగబాబు డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. 'అదిరింది' మొదలు పెట్టేటప్పుడు, 'జబర్దస్త్' నిర్వాహకులపై నాగబాబు ప్రధాన ఆరోపణ. వారు చెప్పాపెట్టకుండా కొందరు కమెడియన్స్ని తీసేశారనీ. కానీ, ఇప్పుడు నాగబాబు కూడా అదే విమర్శ ఎదుర్కొంటున్నారు. 'ఆదిరింది' యాంకర్గా 26 ఎపిసోడ్స్ కోసం సమీరాను సైన్ చేసుకున్నారు. ఎందుకోగానీ 10 ఎపిసోడ్స్ కాగానే ఆమెను తొలిగించారు. కనీసం ఆమెకు సమాచారం కూడా ఇవ్వలేదు. మీడియాలో యాంకర్ మార్పు సంగతి తెలుసుకుని సమీరా ఫోన్ చేసి కన్ ఫర్మ్ చేసుకుందట. పైగా సమీరా చెబుతోన్న దాని ప్రకారం, 'అదిరింది' నిర్వాహకులు యాంకర్ను గ్లామర్ డోస్ పెంచమని అడిగారట. సమీరా హద్దులు దాటలేకపోవటంతో ఉద్వాసన తప్పలేదని అంటున్నారు. ఏది ఏమైనా యాంకర్కు చెప్పాపెట్టకుండా తీసేసి ఉంటే మాత్రం అవమానం, అన్యాయం రెండూ జరిగినట్టే. నాగబాబు దీనిపై మౌనంగా ఉండటం ఆశ్చర్యకరమే. |