Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11871 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 15, 2019 - 3:10 pm: | |
హరికాలం-2 మీరు ఆశిస్తున్నట్టు జగన్ని జైలుకి పంపించి మీకు అధికారం వచ్చేలా చెయ్యటానికి భాజపా తెలివితక్కువ పార్టీ కాదు.భాజపా ఫాలో అవుతున్నదని నేను వూహించిన ప్యాటర్న్ ఇది.మీ పార్టీకి బలమైన అబ్యర్ధులు మాయమైపోయి వనరులు కుంచించుకుపోయాయని తెలిసే వరకు జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చెయ్యదు - పత్రికా ప్రకటనలకి మించి క్రియాత్మక ఆందోళనలు చెయ్యటం లేదు స్థానిక భాజపా నాయకులు కూడా, లాక్కోలేకా పీక్కోలేకా అవస్థలు పడాల్సిన సన్నివేశాలు జరక్కుండా కేంద్రం ముందు జాగ్రత్త హెచ్చరికలు చేసింది కాబోలు!మీ పార్టీ పరిస్థితి/దుస్థితి వాళ్ళకి వీలిచ్చే స్థాయికి తగ్గాక అప్పుడు చిన్న చిన్న గొడవలు చేసి శాంతి భద్రతల పేరుతో రాష్ట్రపతి పాలన పెడతారు.పోలవరం ఓ నాలుగు నెలల్లో పూర్తి చేసి రిబ్బన్ కట్ చేస్తే ఆ తర్వాత ఎన్నికల్లో మీరు దాన్ని గురించి చెప్పుకునే వీలు ఉండదు.రాష్ట్రపతి పాలన కాబట్టి మీరు కూడా నోరెత్తడానికి వీల్లేదు.రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి కూడా వాటిని సాధించలేని మీ అసమర్ధతనీ వైకాపా అరాచకత్వాన్నీ ఫోకస్ చేసి లాభపడుతుంది! ఇప్పటికి మీకు అర్ధమై ఉండాలి జగన్ ప్రభుత్వం మీమీద చేస్తున్న రౌడీ పనులు భాజపాకి కూడా ఆనందాన్ని కలిగించేవేనని.చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం టీడీపీకి లాభం కలగడమే తప్ప భాజపాకి వీసమెత్తు లాభం కూడా ఉండదు.అలాంటప్పుడు భాజపా మీకు అనుకూలం ఎట్లా అవుతుంది?కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చిన నాటినుంచే భాజపా మీ చుట్టూ ముళ్ళకంచెలు పేర్చడం బయటివాళ్ళం మాకు తెలుస్తున్నది గానీ మీకు మాత్రం తెలియలేదు - ఇప్పటికీ అయోమయంలోనే ఉన్నారు!ఈ చక్రవ్యూహాన్ని పోలవరం పనుల్ని కేంద్రం తీసుకుంటుందనే నిర్ణయం ఖరారు అయ్యేలోపున బద్దలు కొట్టడం మీకు సాధ్యపడుతుందా!నేను మీకు ఇద్దామనుకున్న సలహా అదే, కానీ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా అని సందేహిస్తున్నాను. తెలుగుదేశం రామారావు హయాంలో ఎన్నికల ప్రచారం ఎఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది.తనకి భాష మీద వున్న పట్టు గొప్పది కాబట్టి అసభ్య పదాలు వాడాల్సిన అవసరం లేకుండానే ఎదిరి పక్షాల్ని ధాటిగా విమర్శిస్తూ ఉంటే తనతో పోలిస్తే మంచి తెలుగు అంటే ఏంటో తెలియని కాంగ్రెసువాళ్ళు అదే స్థాయిలో ప్రతిదాడి చెయ్యలేకపోయేవాళ్ళు!వూహించని ఓటములు N.T.Rకీ తప్పలేదు గానీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారంలోనూ పరిపాలనలోనూ ఉన్న స్టైల్ ఒకేలా ఉండేది. ఒకసారి గెల్చాక మాత్రం పరిపాలన డిఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది.దానికి కారణం మర్యాదల పట్ల రామారావు కున్న పట్టుదల - అది పీవీ నర్సింహారావుకు పోటీ పెట్టకపోవడంలో బయటపడింది కదా! చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి వ్యతిరేకం - ఎన్నికల ప్రచారం డిఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది .ఎన్నికల ప్రచారంలో తన సమర్ధత గురించి చెప్పుకోవడం తప్ప ఇతరుల బలహీనతల్ని వాడుకోవటం CBN ఒక్కసారి కూడా చెయ్యలేదు. మోదీ, జగన్, కేసీయార్ దిగజారిన స్థాయి ఇంకెవరూ దిగజారలేనంతటిది! ఒకసారి గెల్చాక మాత్రం పరిపాలన ఎఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది. దానికి కారణం ఇతరులు ఆర్ధిక వ్యవస్థని ఛిన్నాభిన్నం చేసిన తర్వాత తను రావటం - అయితే గతంలోనూ ఇప్పుడూ దాన్నొక చాలెంజిగా తీసుకుని పోరాడి అతి తక్కువ కాలంలో వ్యవస్థని అభివృద్ధి వైపుకు నడిపించటం తారీఖులూ గణాంకాలూ కూడా ఉన్న చారిత్రక సత్యం! విచిత్రం ఏమిటంటే, CBN యొక్క పెర్ఫార్మెన్స్ రికార్డ్ కనపడినా నిన్నటి ఎన్నికల్లో "బాబు తోడు లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓడిపోవటం!" కాక వైకాపా ప్రచారం చేసిన మూఢనమ్మకం లాంటి మరో వాస్తవం "రెండుసార్లు వరస ఎన్నికల్లో గెలవకపోవటం!" అనేది పదే పదే ఎట్లా జరుగుతున్నది? CBN నేతృత్వంలో ఓడిపోయిన అన్ని ఎన్నికల్లోనూ అలవాటైన డిఫెన్సివ్ పద్ధతికి బదులు ఎఫెన్సివ్ పద్ధతి ఫాలో అయితే తెలుగుదేశం గెలిచి ఉండేది.అప్పుడు వయ్యస్సార్ ఇప్పుడు వైయస్జే పాదయాత్రలూ బుగ్గల రుద్దుడు యాత్రలూ చేసి ఫోకస్ తమనుంచి మళ్ళిపోకుండా చూసుకున్నారు.CBN చేస్తున్న అభివృద్ధి వెనక్కి పోయి అక్కడ జరుగుతున్న హడావిడికి కవరేజి ఇచ్చిన మీడియా వల్ల వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు గెలవటం ఖాయం అనే ముద్ర జనంలో పడిపోయింది.అలా ఎఫెన్సివ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేస్తున్నాం అనే ధీమాతో అలవాటైన డిఫెన్సివ్ పద్ధతినే ఫాలో అయ్యారు, ఓడిపోయారు!ఒకసారి CBN పాదయాత్రని గుర్తుకు తెచ్చుకోండి - అది కూడా పైన నేను చెప్పిన ప్యాటర్న్ CBNకు అనుకూలం అవడం వల్లనే దాని ఫలితాన్ని అది ఇచ్చింది! తెదెపా క్రియాశీల సభ్యులు అందరూ ఎన్నికల స్ట్రాటజీల్ని తమ వైపునుంచి చూసి ఫాలో అవుతున్నారు.కానీ ఇటు వైపు నుంచ్బి చూస్తే ఓటర్లు తాము వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే పొంగిపోవడమూ రాకపోతే కుంగిపోవడమూ జరుగుతుంది - గుర్రప్పందాల్లో గెలుస్తుందనుకున్న గుర్రం మీదే అందరూ పందాలు కాస్తారు కదా!నిన్నటి ఎన్నికల్లో మోదీ, కేసీయార్, జగన్ ముగ్గురూ కలిసికట్టు దాడి చేస్తుంటే ఎఫెన్సివ్ దాడి చెయ్యాల్సింది పోయి డిఫెన్సివ్ పద్ధతిని కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు.కేసీయార్ హైదరాబాదులో ఆస్తులున్నవాళ్ళని బెదిరించి వైకాపాలోకి పంపిస్తున్నట్టు ఆ దాడికి గురవుతున్న వ్యక్తి సాక్షాత్తూ CBN సమక్షంలోనే expose చేసినా దానికి కనీసం remidial action కూడా తీసుకోలేదు - ప్రజల్లో మీకు గెలుపు గుర్రం ఇమేజి ఎట్లా వస్తుందనుకున్నారు? |