Subbarao1
Kurra Bewarse Username: Subbarao1
Post Number: 1352 Registered: 10-2018 Posted From: 223.238.93.221
Rating: N/A Votes: 0 | Posted on Monday, September 30, 2019 - 11:52 am: | |
విద్యుత్ రంగంలో చంద్రబాబు చేసిన పాపాలు ఇప్పుడు గుదిబండలుగా మారాయని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతి, లంచగొండితనం, తప్పుడు విధానాల కారణంగా ఎన్నడూలేని రీతిలో విద్యుత్ రంగం అత్యంత క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోందని మంత్రి చెప్పారు. చంద్రబాబు తప్పులు, అక్రమాలను శ్రీ వైయస్.జగన్గారికి ఆపాదించడానికి టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో విద్యుత్ రంగంలో అవినీతి గురించి, అక్రమాల గురించి, అస్తవ్యస్త విధానాల గురించి ఏరోజుకూడా ప్రజలపక్షాన ఆ వర్గం మీడియా పనిచేయలేదన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని మంత్రి అన్నారు. మార్చి 2019 నాటికి కరెంటు సరఫరాచేస్తున్న సంస్థలకు చంద్రబాబు రూ.20వేల కోట్లు బకాయిలు పెట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్.జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యుత్రంగంపై సమీక్షచేసి, ఆరంగాన్ని కాపాడ్డానికి దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. దీంట్లో భాగంగా అనేక చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు. కరెంటు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నారని, కేవలం ఎన్టీపీసీకే రూ. 3414 కోట్లు చెల్లించామని, మరో రూ.1200 కోట్ల రూపాయలను ఇతర విద్యుత్ సంస్థలకు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందులో రూ.700 కోట్లు ప్రైవేటు థర్మల్ కేంద్రాలకు, మరో రూ.460 కోట్లు ట్రాన్స్మిషన్ బకాయిలను చెల్లించామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికి, వ్యవస్థలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాలు, కొరత కారణంగా థర్మల్విద్యుత్ కేంద్రాలు పడుతున్న ఇబ్బందులను నివారించడానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖరాయడంతోపాటు, సింగరేణి నుంచి ఉత్పత్తిపెంచాల్సిందిగా కోరారని గుర్తుచేశారు |