Subbarao1
Kurra Bewarse Username: Subbarao1
Post Number: 1351 Registered: 10-2018 Posted From: 223.238.93.221
Rating: N/A Votes: 0 | Posted on Monday, September 30, 2019 - 11:40 am: | |
Lovebewarsetalk:
మార్చి 2019 నాటికి కరెంటు సరఫరాచేస్తున్న సంస్థలకు చంద్రబాబు రూ.20వేల కోట్లు బకాయిలు పెట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్.జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యుత్రంగంపై సమీక్షచేసి, ఆరంగాన్ని కాపాడ్డానికి దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. దీంట్లో భాగంగా అనేక చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు. కరెంటు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నారని, కేవలం ఎన్టీపీసీకే రూ. 3414 కోట్లు చెల్లించామని, మరో రూ.1200 కోట్ల రూపాయలను ఇతర విద్యుత్ సంస్థలకు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందులో రూ.700 కోట్లు ప్రైవేటు థర్మల్ కేంద్రాలకు, మరో రూ.460 కోట్లు ట్రాన్స్మిషన్ బకాయిలను చెల్లించామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికి, వ్యవస్థలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాలు, కొరత కారణంగా థర్మల్విద్యుత్ కేంద్రాలు పడుతున్న ఇబ్బందులను నివారించడానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖరాయడంతోపాటు, సింగరేణి నుంచి ఉత్పత్తిపెంచాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. |