Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11822 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 | Posted on Monday, September 23, 2019 - 10:11 am: | |
https://www.andhrajyothy.com/artical?SID=912048 భూ కబ్జాలు, దౌర్జన్యాలు గుంటూరులో హడలెత్తిస్తున్నాయి. భూముల్లో రాత్రికి రాత్రే కర్రలు పాత్తున్నారు. అడవితక్కెలపాడు పంచాయితీలో భూ కబ్జాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా దళిత సంఘాలను తెరముందుంచి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న భూ యజమానులు స్థలాలవద్దకు వెళితే..పేదలకు సీఎం జగన్ స్థలాలు ఇస్తారని చెప్పండని ఆక్రమణదారులు సమాధానం ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఊహించిన విధంగానే ప్రభుత్వ భూములు కాకుండా.. పట్టా, సొంతభూములపై కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గత రెండు రోజుల నుంచి విశాఖ నగరంలో కలకలం రేపుతున్న.. సీఎం మనుషుల మంటూ సెటిల్మెంట్లు, భూదందాలకు పాల్పడుతున్నతీరు చర్చనీయాంశంగా మారగా.. తాజాగా గుంటూరు నగర శివారులో అడవితక్కెలపాడు పంచాయితీ పరిధిలో దాదాపు పదెకరాలకుపైబడి ఉన్న పట్టా భూమిలో నిన్న సాయంత్రం నుంచి కొంతమంది ఆక్రమణకు పాల్పడుతున్నారు. అక్కడ గుడిసెలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భూ యజమానులు అక్కడికి చేరుకుని ఇది తమ సొంత భూమి అని చెప్పగా.. ఆక్రమణదారులు మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని, తాము పేదలమని.. గుడిసెలు వేసుకుంటామని చెబుతున్నారు. ఈ ఘటనపై భూ యజమానులు డాక్యుమెంట్లతో సహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. |