Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11692 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Monday, July 22, 2019 - 1:11 pm: | |
తాను ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తానని గవర్నర్ నరసింహన్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు గవర్నర్గా పనిచేశానని.. తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలని కోరారు. ఏపీకి కొత్త గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ నరసింహన్కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలోని గేట్వే హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ఆయన సతీమణి భారతితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ఏపీలో కొత్తగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలని ఆకాంక్షించారు. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు భావోద్వేగంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్తో తనకు ఎంతో అనుబంధం ఉందని.. 1951లో విజయవాడలోనే తన అక్షరాభ్యాసం జరిగిందన్నారు. అప్పట్లో విజయవాడలోని గవర్నర్పేటలో ఉండేవాళ్లమని నరసింహన్ గుర్తుచేసుకున్నారు. తనకు అహోబిలం నరసింహ స్వామి పేరు పెట్టారని.. ఈ రాష్ట్రానికి ఆ నరసింహుడి అండ ఎప్పుడూ ఉంటుందన్నారు. సీఎం జగన్ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. కెప్టెన్గా జగన్ నాటౌట్ కాకూడదని నరసింహన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నియమాల మేరకే శాసనసభ సమావేశాలు జరగుతున్నాయని ఆయన అన్నారు. |