Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11345 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 11, 2019 - 3:38 pm: | |
Gudivada04:
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్లోనే ‘అతిపెద్ద మోదీ ప్రభుత్వపు వేవ్’ను తాను గుర్తించానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసోంలోని సిల్చార్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘గాలి ఎటువైపు వీస్తుందో మీ ఉత్సాహంలో కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ రోజు తొలిదశ పోలింగ్ జరిగింది. మోదీ సర్కార్ మరోసారి కొలువు దీరడం కోసం అతిపెద్ద వేవ్ కనిపిస్తోంది. మెజార్టీ స్థానాలను భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంటుంది’ అని అన్నారు. అసోం రాష్ట్రం టీ తోటలకు ప్రసిద్ధి. దాంతో ఆయన చాయ్వాలా ఉద్దేశంతో కాంగ్రెస్ మీద విమర్శల పర్వాన్ని కొనసాగించారు. ‘బంగారు స్పూన్లతో పుట్టిన వారు కేవలం టీని మాత్రమే రుచి చూస్తారు. టీ ఆకులను తెంపేప్పుడు చేతులకయ్యే గాయాలు, రసాయనాల వల్ల వచ్చే వ్యాధుల గురించి వారు అర్థం చేసుకోలేరు’ అని వెల్లడించారు. కాంగ్రెస్ చాయ్వాలా పట్ల విద్వేషాన్ని ప్రదర్శిస్తుందన్నారు. ‘నేను ఒక్కడినే కావడం వల్ల కాంగ్రెస్ నా మీద ఆరోపణలు చేస్తుందనుకున్నాను. కానీ దశాబ్దాలుగా కాంగ్రెస్ కనీసం అసోం, పశ్చిమ బెంగాల్లోని టీ తోటల వైపు కన్నెత్తి చూడలేదు’ అని విమర్శించారు. |