Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11317 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 03, 2019 - 8:52 am: | |
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. 350 డమ్మీ ఈవీఎంలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పోలవరంలో వైకాపాకు చెందిన ఓ నాయకుడికి కొన్ని డమ్మీ ఈవీఎంలను అప్పగించి మిగతావి విశాఖ జిల్లాకు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు సమాచారం. |