Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1869 Registered: 10-2005 Posted From: 107.4.212.46
Rating: N/A Votes: 0 | Posted on Monday, March 25, 2019 - 3:20 am: | |
ఫీజు రీఎంబర్స్మెంట్ ఏపీ సీఎం చంద్రబాబు ఇవ్వని కారణంగా ఎందరో విద్యార్థులు చదువు మానేశారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లిందన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు.. లోకేష్కి జాబ్ వచ్చింది. లోకేష్కి ఏకంగా మూడు శాఖలు అప్పగించారు. కేటీఆర్ ఐటీ శాఖ నిర్వహిస్తున్నారని లోకేశ్కు ఐటీ శాఖ ఇచ్చారు. లోకేష్కు జయంతి, వర్థంతికి తేడా తెలియదు. ఏ అర్హత ఉందని మూడుశాఖలకు మంత్రిని చేశారు. ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. బాబు, మోదీ జోడి కలిసి ఏపీకి రావాల్సిన హోదాను ఎగ్గొట్టేశారు. బీజేపీ మన చెవిలో పువ్వులు పెట్టడానికి బాబే కారణం. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని బాబు అన్నారు. హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. చంద్రబాబు ప్రతి ఇంటికి లక్షా 25వేలు బాకీ పడ్డారు. చంద్రబాబువి మళ్లీ కొత్త అబద్ధాలు, మళ్లీ మోసపు హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు చందమామను తెచ్చిస్తామంటే ప్రజలు మళ్లీ నమ్మాలా..?. నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా..?" ప్రత్యేక హోదా కోసం జగన్ ధర్నాలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టాం. వైసీపీ ఎంపీలు రాజనామాలు కూడా చేశారు. ప్యాకేజీ అన్న చంద్రబాబుని యూటర్న్ తీసుకునేలా చేసింది జగనే. చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషం. చంద్రబాబుని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది. చంద్రబాబు.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. జగన్ అవినీతి చేసి ఉంటే కాంగ్రెస్ని వీడేవారు కాదు" |