Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1856 Registered: 10-2005 Posted From: 107.4.212.46
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, January 29, 2019 - 12:41 am: | |
పర్చూరులో ధిక్కార స్వరం సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు అధినేత జగన్ను కలవడం అత్యంత సానుకూల పరిణామంగా వైసీపీ ప్రకటించుకుంది. ఆ పార్టీకి చెందిన మీడియాలో కూడా ఆ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే సోమవారం ఆ నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు దగ్గుబాటికి వ్యతిరేకంగా రోడ్డెక్కడంతో నాయకులు కంగుతిన్నారు. ప్రస్తుత ఆ పార్టీ సమన్వయకర్త రామనాథం బాబును అధిష్ఠానం తక్కువ అంచనా వేయగా హితేష్ కన్నా రామనాథం బాబే మేలంటూ ఆ పార్టీ శ్రేణులు తీర్మానం చేయడం విశేషం. సోమవారం పర్చూరులో సమావేశమైన ఆ పార్టీకి చెందిన వందలాది మంది ఆ విషయంపై ఏకగీవ్రంగా నిర్ణయాన్ని ప్రకటించారు. దగ్గుబాటి సొంత మండలమైన కారంచేడు మండల వైసీపీ కన్వీనర్ మినహా మిగిలిన మండలాల కన్వీనర్లు అందుకు మద్దతు పలికారు. వివిధ కేసుల్లో చిక్కుకొన్న యద్దనపూడి, చినగంజాం కన్వీనర్లు బహిరంగంగా రాలేక సమావేశానికి హాజరుకాలేదు. పార్టీ మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు మండల కన్వీనర్లతో పాటు అత్యధిక గ్రామాల్లోని వైసీపీ శ్రేణులు, ప్రత్యేకించి కొన్నిప్రాంతాల్లోని సీనియర్లు హాజరయ్యారు. అంతకు మించి సమావేశానికి హాజరుకాని రామరాథంబాబుతోపాటు వైసీపీకి నియోజకవర్గంలో వ్యూహకర్తలుగా ఉన్న పలువురు నాయకులు ఈ సమావేశానికి మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. ఆ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న ఒక సామాజికర్గానికి చెందిన నాయకులు కూడా దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తూ అసమ్మతి సమావేశాన్ని ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. http://www.andhrajyothy.com/artical?SID=702318 |