Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27713 Registered: 08-2004 Posted From: 130.233.92.218
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 22, 2018 - 4:42 am: | |
టీడీపీ, కాంగ్రెస్లతో జాగ్రత్తగా ఉండాలని.. లేకుంటే దెబ్బతింటారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఖానాపూర్ ప్రచారసభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేదని.. పాలన చేయడం రాదని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ సక్రమంగా అందదన్నారు. ఆయనేమన్నారంటే.. ‘‘రాష్ట్రం తెచ్చింది నేను. కష్టపడి తెచ్చినా.. 58 ఏళ్లలో వాళ్లు ఏం చేశారు? వీళ్లేమైనా కొత్తగా వచ్చారా? ఓడిపోంగానే.. హిమాలయాలకు పోయి ఆకు పసరు తాగొచ్చరా... పవిత్రం అయిపోయారా.. మళ్లీ నమ్మితే పంటికి అంటకుండా మింగేస్తారు. వాళ్లకు చేతగాక ఆంధ్రకుపోయి చంద్రబాబు నాయుడుని భుజాలపై తీసుకువస్తున్నారు. మళ్లీ చంద్రబాబు అవసరమా.. కత్తి ఆంధ్రోడు ఇస్తాడు. కానీ పొడిచేది తెలంగాణోడే.. బాబు డబ్బులు ఇవ్వాలి.. టిక్కట్లు ఇవ్వాలి. రేపు పెత్తనం చంద్రబాబుది వస్తే దరఖాస్తులు పట్టుకుని అమరావతికి పోవాలి. కొంతమంది అమరావతికి బానిసలు.. మిగిలినవాళ్లు ఢిల్లీ గులాములు. ఈ గులాముల పాలన మనకు కావాలా.? సీరియస్గా ఆలోచించండి. లేకుంటే దెబ్బతింటారు. టీఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చే నష్టం పెద్దగా ఏం లేదు. గెలిపిస్తే గట్టిగా పని చేస్తా.. లేదంటే ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా. నష్టపోయేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దంటూ కేంద్రానికి చంద్రబాబు 35 ఉత్తరాలు రాశాడు. వీళ్లు అధికారంలోకి వస్తే మన ప్రాజెక్టులు సాగనిస్తాడా? ఆయన మనసు ఇటు గుంజుతాదా’’ అంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. space for lease
|